డబ్బులు కోసం హీరోయిన్లందరూ.. !

కరోనా వల్ల ఎవరికైనా మేలు జరిగింది అంటే.. అది కచ్చితంగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వారికే. కరోనా మహమ్మారి రాకతో సినిమాలను థియేటర్స్ లో చూసే అవకాశం లేకపోవడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అయింది. పైగా నేటి పిల్లలు కూడా డిజిటల్ డిఎన్ఏతోనే పుడుతున్నట్టు.. కిడ్స్ అందరికి ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లలోని గేమ్స్ అలవాటు అయిపోయాయి. కార్టూన్ల సిరీస్ లు సరదా అయిపోయాయి. పైగా గతంలో పోల్చుకుంటే నేటి యువత కూడా […]

Written By: admin, Updated On : July 28, 2020 9:36 am
Follow us on


కరోనా వల్ల ఎవరికైనా మేలు జరిగింది అంటే.. అది కచ్చితంగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వారికే. కరోనా మహమ్మారి రాకతో సినిమాలను థియేటర్స్ లో చూసే అవకాశం లేకపోవడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అయింది. పైగా నేటి పిల్లలు కూడా డిజిటల్ డిఎన్ఏతోనే పుడుతున్నట్టు.. కిడ్స్ అందరికి ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లలోని గేమ్స్ అలవాటు అయిపోయాయి. కార్టూన్ల సిరీస్ లు సరదా అయిపోయాయి. పైగా గతంలో పోల్చుకుంటే నేటి యువత కూడా స్మార్ట్‌ ఫోన్స్ లోనే సర్వస్వం కానించేస్తున్నారు. ఇలాంటి పరిస్తుతుల్లో డేటా వాడకం అత్యంత వేగంగా పెరిగిపోయింది.

Also Read: భల్లాలదేవతో బాలీవుడ్‌ క్వీన్‌ జోడీ

పైగా నేటి యువతరం అభిరుచి కూడా అంతకన్నా వేగంగా మారుతుంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ మాయలో పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలోనే పెద్ద నిర్మాణ సంస్థలు, స్టార్ డైరెక్టర్స్ సైతం వెబ్ లో అడుగు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు వెబ్ సిరీస్ లను నిర్మించడానికి రెడీ అవుతుంటే.. మరికొందరు ఏకంగా డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ లో తమ అందచందాల ప్రదర్శనకు సై అంటున్నారు. మళ్ళీ సినిమాలతో ఎప్పుడు బిజీ అవుతామో తెలియదు. డబ్బులు రుచి మరిగిన ప్రాణాలు అయ్యే.. మరీ ఖాళీగా కూర్చోవాలంటే హీరోయిన్లకు తెగ ఇబ్బంది అయిపోతుంది. అందుకే వెబ్ సిరీస్ కథలు బోల్డ్ గా ఉన్నా… డబ్బు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.

Also Read: కరోనాను జయించిన ఐశ్యర్యా రాయ్‌..

ఇప్పటికే అలా సిద్ధం అయి స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించి.. వెబ్ వరల్డ్ లో తానూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంది. అలాగే డబ్బు సంపాదన పోతుందేమోనని పెళ్లి కూడా చేసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయబోతోంది. ఇప్పుడు వీరి బాటలోనే త్రిష, బబ్లీ బ్యూటీ హన్సిక, మిల్క్ బ్యూటీ తమన్నా కూడా అడుగులు వేస్తున్నారు. త్రిష, తమన్నా తమిళంలో చేరో వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. హన్సిక కూడా హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆ సిరీస్ కోసం బాగా ఇంట్రస్టింగ్ గా కూడా ఉందట. అమలా పాల్ కూడా ఓ హిందీ వెబ్ సిరీస్ లో తన గ్లామర్ ను సర్వస్వం ఒడ్డి నటిస్తోంది. అలాగే అనుష్క కూడా తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి డబ్బులు కోసం హీరోయిన్లందరూ వెబ్ లోకి వచ్చేస్తున్నారు.