Samantha: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత- నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత.. ఎక్కువ సమయాన్ని స్నేహితులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి సామ్ విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇన్స్టా, ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ కనిపించింది. తాజాగా, సమంత తన స్నేహితురాలు డాక్టర్ మంజుల పుట్టినరోజు వేడుకకు హాజరైంది. ఈ పార్టీకి సామ్తో పాటు తన స్నేహితురాలు, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
https://www.instagram.com/p/CWAEwt1hn1M/?utm_source=ig_web_copy_link
పోస్ట్లో భాగంగా మంజులను ఉద్దేశిస్తూ.. నీ లాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలో భాగమవడం నా అదృష్టంగా భావిస్తున్నా అంటూ పేర్కొంది. నీ కంటే నిజమైన స్నేహితులు ఎవ్వరూ లేరంటూ భావోద్వేగంతో తెలిపింది. నా ప్రేమ నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటూ.. బర్త్డే విషెస్ తెలిపింది.
మరోవైపు ప్రస్తుతం విడిగా ఉంటున్న సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లోనూ అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. శాకుంతలం సినిమాతో పాటు, విజయ్ సేతుపతితోనూ ఒక సినిమాకు ఒప్పందం కుదుర్చుకుంది. మరి తను భవిష్యత్తు కోసం కన్న కలలు ఎంత మేరకు నెరవేరతాయో చూడాలి మరి.