Samantha: ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఈ క్రమంలోనే నాగ చైతన్యను వివాహం చేసుకుని.. కెరీర్లో మరింత ముందుకు దూసుకెళ్తోంది. వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా చైతూ- సామ్ల విడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి విడాకుల ప్రకటన తర్వాత తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది సామ్. సామ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. అసత్య ప్రచారాలు చేసిన యూట్యూబ్ ఛానెల్స్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి వాళ్ల నోరు మూయించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో సినిమాలు, వెబ్సిరీస్లు చేస్తూ కెరీర్పై దృష్టి సారిస్తోంది.

తాడాగా, సమంత గొప్పతనం చాటేలా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ యంగ్ బ్యూటీ తేజస్వి తనకు సమంత కేరీర్లో ఎంత అండగా నిలిచిందో వివరించింది. అందరిలానే కేరీర్ ప్రారంభంలో తానూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. చిన్న రోల్స్ చేసుకుంటూ.. ఇంటి నుంచి సపోర్ట్ కూడా ఉండేది కాదని చెప్పింది.
కాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో తాను టీబీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆ సమయంలో వైద్యులు ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారని చెప్పింది. కానీ, అంత డబ్బు ఆ సమయంలో తన వద్ద లేదని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న సమంత.. తేజస్విని పిలిచి వైద్యానికి సంబంధించిన ఖర్చు మత్తం తానే భరిస్తానని సామ్ ధైర్యం చెప్పినట్లు పేర్కొంది. ఇటీవల ఈ విషయం వెలుగురావడం వల్ల సామ్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు, సామ్ చేసే సేవా కార్యక్రమాలు అందరికీ తెలిసిందే. తాను ప్రారంభించిన ప్రత్యూష పౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తోంది.