Actress Rashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమా తోనే ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. ఆ తరవాత వచ్చిన ‘జిల్’ సినిమాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది. కాగా ప్రస్తుతం తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్తో ‘పక్కా కమర్షియల్’లో సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలానే తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3′, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’లో నటిస్తూ ఫుల్ బిజిగా ఉంది అమ్మడు.
అయితే తాజాగా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ బ్యానర్ లో ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. కరణ్ నిర్మాణంలో యాక్షన్ ఫ్రాంచైజీ ఒకటి రూపొందనున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీతో పాటు ఇతర బాలీవుడ్ ప్రధాన తారాగణంతో మొదలుకానున్న ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి ‘యోధ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు ఈ ప్రాంచైజీకి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్లను పూర్తి చేసింది రాశీ.
కరణ్ బ్యానర్ లో అవకాశం అంటే అది రాశీ కెరీర్ కి బాగా ఉపయోగపడనుంది. ఇందులో మంచి క్యారెక్టర్ పడితే రాశీ బీటౌన్ లో పాతుకుపోవడం గ్యారంటీ అని అమ్మడి అభిమానులు ఆనందపడిపోతున్నారు. ఇందులో ఒకటి షాహిద్ హీరోగా ‘సన్నీ’ కాగా… మరొకటి అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన ‘రుద్ర’. ఇక ఇప్పుడు ఇవి బయటకి రాకుండానే ఈ భామకు మరో బంపర్ అఫర్ దక్కడం విశేషం అనే చెప్పాలి. అలానే రాశి మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.