Poonam Kaur: ఈటెల రాజేందర్ ను కలిసిన నటి పూనమ్ కౌర్…

Poonam Kaur: తేజ దర్శకత్వంలో రూపొందిన `ఒక విచిత్రం` సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి పరిచయమైంది పూనమ్‌ కౌర్‌. 2006 లోనే తన కెరీర్‌లో రెండో చిత్రం `మాయాజలం`కు సంతకం చేసింది. ఈ సినిమా `ఒక వి చిత్రం` విడుదలకు ముందే రిలీజైంది. దాంతో పూనమ్ కౌర్ తొలి చిత్రం ‘మాయాజలం’ అయింది. 2007 లో పూనమ్ `నెంజిరుక్కుం వారై` చిత్రంతో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2008 లో ఆమె `బంధు బలగా` చిత్రంతో కన్నడ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 19, 2021 7:54 pm
Follow us on

అయితే తాజాగా పూనమ్ కౌర్.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళింది. గురునానక్ జయంతి సందర్భంగా ఈటెల రాజేందర్ ను కలిసింది పూనమ్ కౌర్. ఈ సందర్భంగా పావురాలను ఈటెల రాజేందర్ తోపాటు పూనమ్ కౌర్ ఎగుర వేసింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ తో పాటు బిజెపి నాయకులు ఉన్నారు. కాగా అక్టోబర్ 30వ తేదీన జరిగిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బిజెపి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.