Divyansha Kaushik: ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది. చేసిన తొలి సనిమాతోనే అంద చందాలతో ప్రేక్షకుల మనసును గెలిచి.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటూ.. కెరీర్లో వరుస అవకాశాలతో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. అలా టాలీవుడ్లో రాణిస్తోన్నయంగ్ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కాగా, తన అందం అభినయంతో మజిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ హాట్ హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్. సమంత- నాగ చైతన్య జంటగా నటించిన ఈ సినిమాలో దివ్యాన్షి ఓ కీలక పాత్ర పోషించింది. నిజానికి సినిమా మొత్తం ఈమె చుట్టే తిరుగుతుంది. ఇలా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సుపరిచితమైన దివ్యాన్ష.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్లిపోతోంది.

ప్రస్తుతం మాస్మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది దివ్యాన్ష. శరత్ మండవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజాగా, ఈ హాట్ బ్యూటీ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో వస్తోన్న మైఖేల్ సినమాలో హీరోయిన్గా కనిపించనున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.
ఈ సినిమాను తెలుగుతో పాటు 5 ప్రధాన భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్ ఎల్ఎల్పి బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణంలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఇందులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్గా నటిస్తున్నారు.