Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: స్నేహితులతో మహేశ్​ ఫ్యామిలీ వీకెండ్​ ఎంజాయ్​.. నెట్టింట్లో ఫొటోలు వైరల్​

Mahesh Babu: స్నేహితులతో మహేశ్​ ఫ్యామిలీ వీకెండ్​ ఎంజాయ్​.. నెట్టింట్లో ఫొటోలు వైరల్​

Mahesh Babu: సూపర్​స్టార్​ మహేశ్​బాబు కుటుంబం ఈ వీకెండ్​ బాగా ఎంజాయ్​ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. మహేశ్​, ఆయన భార్య నమ్రత శిరోద్కర్​ శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. మంచి భోజన, సరదా కబుర్లతో గడిపిన అనంతంరం శనివారం సాయంత్రం స్నేహితులకో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఈ పిక్​లో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో మహేశ్​కు ఉన్న అతికొద్ది మంది సన్నిహితుల్లో వంశీ ఒకరు. వీరితో పాటు పిక్​లో పలువురు కనిపిస్తున్నారు.

about-last-night-fun-evenings-good-times-namrata-shirodka

కాగా, ఈ ఫొటోలను నమ్రత ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, టాలీవుడ్​లో ప్రేమ జంటగా కలిసి.. మూడుముళ్లతో ఒకటైన వారిలో మహేశ్​ నమ్రత కూడా ఒకరు. ఇప్పటికీ అన్యూణ్య దంపతుల్లా కలిసిమెలసి జీవిస్తుంటారు. మరోవైపు, మహేశ్​ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు థమన్​ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్​ 1న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, వీడియోలు నెట్టింట హల్​చల్​ చేస్తున్నాయి. దీంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేశ్​ ఫుయ్​ యంగ్ అండ్ హ్యాండ్సమ్​గా కనిపిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular