Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Season 17: బిగ్ బాస్-17 రన్నరప్ గా నిలిచిన తర్వాత అభిషేక్ సంచలన...

Bigg Boss Season 17: బిగ్ బాస్-17 రన్నరప్ గా నిలిచిన తర్వాత అభిషేక్ సంచలన వ్యాఖ్యలు

Bigg Boss Season 17: హిందీలో బిగ్ బాస్-17 సీజన్ ఆదివారంతో పూర్తయింది. గత ఏడాది అక్టోబర్ 15న ప్రారంభమైన ఈ సీజన్ 2024 జనవరి 28 వరకు కొనసాగింది. 17 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొన్నారు. రింకు ధావన్, ఫిరోజా ఖాన్, జిగ్నా వోరా, ఇషా మాల్వియా, నీల్ భట్, దోభాల్, విక్కీ జైన్, ఆయేషా ఖాన్ వంటి వారు ఈ సీజన్లో ప్రధాన పోటీ దారులుగా ఉన్నారు. అయితే ఫైనల్ లో మునావర్ ఫారూఖీ విజయం సాధించాడు. ట్రోఫీతో పాటు 50 లక్షలు నగదు, ఒక కారు కూడా సొంతం చేసుకున్నాడు.. ఫైనల్లో అభిషేక్ కుమార్ తో మునావర్ పోటీ పడ్డాడు. ఫైనల్ లో రన్నరప్ గా నిలిచిన తర్వాత అభిషేక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

బిగ్ బాస్ -17 సీజన్లో చెంప దెబ్బ ఎపిసోడ్ తో అభిషేక్ కుమార్ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. బుల్లితెర నటుడిగా హిందీ ప్రజలకు సుపరిచితుడు అయినప్పటికీ..బిగ్ బాస్ -17 సీజన్ లో ఎటువంటి అంచనాలు లేకుండానే హౌస్ లోకి అడుగుపెట్టాడు. మొదట్లో అంతగా ఆడని అభిషేక్.. చెంప దెబ్బ ఎపిసోడ్ తో ఒక్క సారిగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు చివరి వారాల్లో ప్రొఫెషనలిజం చూపించడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. వివిధ వెబ్సైట్ లు నిర్వహించిన ఓటింగ్ లో నెంబర్ వన్ స్థానం పొందాడు. చాలామంది అతడు ట్రోఫీ గెలుచుకుంటాడని భావించారు. అంతేకాదు కొన్ని విషయాల్లో అభిషేక్ కుమార్ ముక్కుసూటిగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.. ఈ షో కు వచ్చే కంటే ఏడాదికి ముందు అతడు ఈశా అనే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాడు. తర్వాత అభిప్రాయ బేధాలు ఏర్పడి ఇద్దరు విడిపోయారు. ఈ క్రమంలో అతడు హౌస్ లో ఉన్నప్పుడు ఈషాతో బంధం చర్చకు వచ్చింది.” ఈషాతో నాకున్న బంధం ప్రత్యేకం. ఆమెతో ఉన్న ప్రతిక్షణం నాకు అపురూపం. కానీ ఇప్పుడు ఆ బంధాన్ని నేను తిరిగి ప్రారంభించాలి అనుకోవడం లేదు. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి తారస పడితే కచ్చితంగా ఆ బంధంలోకి వెళ్లిపోతాను” అని అభిషేక్ కుమార్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో చాలామంది అతనికి ఫిదా అయిపోయారు. ఫలితంగా అతని అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. కానీ కొన్ని టాస్కుల విషయంలో అతడు చేసిన తప్పిదం మునావర్ ను విజేతను చేసింది..

బిగ్ బాస్ _17 సీజన్ రన్నరప్ అయిన తర్వాత అభిషేక్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఎక్స్ లో పంచుకున్నాడు. ” ఫైనల్ లో వేదిక ముందు సల్మాన్ ఖాన్ ను చూడటం ఆనందంగా ఉంది. ప్రత్యక్షంగా నన్ను సల్మాన్ ఖాన్ పక్కన చూసి నా తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు.. సీజన్-17 లో దుమ్ము దులిపాను. ఇక తర్వాత చాలా మిగిలి ఉంది..ఇషా తో ఉన్న సంబంధం ప్రత్యేకం. ఆట ప్రారంభంలో ప్రతి సందర్భంలో ఈషాపై నాకున్న ప్రేమను నేను వ్యక్తపరిచాను. కానీ అది ఆటలో భాగం కాదు. హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత నేను చాలా టాస్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. అలాంటప్పుడు నా గత ప్రేమతో వాటిని పోల్చి చూడకూడదు. షో అయిపోయింది కాబట్టి ఇక ఈశా గురించి నన్ను అడగవద్దు. ఎందుకంటే ఆమెతో నిన్ను దూరంగా ఎందుకంటే ఆమెతో నేను ఏడాది క్రితం నుంచే దూరంగా ఉంటున్నాను.. ఇక ఇటువంటి వాటిపై ప్రశ్నలు అడగొద్దని కోరుకుంటున్నాను. నన్ను స్థితిలో చూసి నా తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. రియాల్టీ షో ఎవరినైనా విచ్చిన్నం చేయగలదు. లేదా మరింత పరిపూర్ణం చేయగలదు. నా వరకైతే హౌస్లో అడుగుపెట్టేముందు నాకు ఎటువంటి అంచనాలు లేవు. షో పూర్తి అయిన తర్వాత ఒక కొత్త అభిషేక్ కుమార్ గా బయటికి వెళ్తున్నాను. నేను చేయాల్సినవి చాలా ఉన్నాయని” అభిషేక్ చెప్పుకొచ్చారు. అభిషేక్ కుమార్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version