Bigg Boss 7 Telugu: మధ్యలో మాట్లాడితే పగిలిపోతుంది, కప్పు నాదే… వాళ్లకు అమర్ దీప్ స్ట్రాంగ్ వార్నింగ్!

పల్లవి ప్రశాంత్ వెనుక శివాజీ ఉన్నట్లు అమర్ దీప్ మాట్లాడాడు. నీ వెనుక రెండు పెద్ద చేతులు ఉన్నాయి కాపాడతాయి అనుకుంటున్నావని అన్నాడు. శివాజీ మధ్యలో కల్పించుకోగా.. నువ్వు డైరెక్ట్ గా ప్రశాంత్ సపోర్ట్ చేస్తే చేసేయ్ అన్నా... అని అమర్ దీప్ అన్నాడు.

Written By: NARESH, Updated On : October 25, 2023 10:07 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి చర్చ జరిగింది. పల్లవి ప్రశాంత్ ఇద్దరిని నామినేట్ చేశాడు. గౌతమ్ తో పాటు అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. ఈ రెండు నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ వాడివేడిగా వాదించుకున్నారు. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ మాట్లాడుకుంటుండగా భోలే మధ్యలో మాట్లాడాడు. కుర్చీని తన్నిన అమర్.. మధ్యలో మాట్లాడితే పగిలిపోతుంది అని భోలేకి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు.

పల్లవి ప్రశాంత్ వెనుక శివాజీ ఉన్నట్లు అమర్ దీప్ మాట్లాడాడు. నీ వెనుక రెండు పెద్ద చేతులు ఉన్నాయి కాపాడతాయి అనుకుంటున్నావని అన్నాడు. శివాజీ మధ్యలో కల్పించుకోగా.. నువ్వు డైరెక్ట్ గా ప్రశాంత్ సపోర్ట్ చేస్తే చేసేయ్ అన్నా… అని అమర్ దీప్ అన్నాడు. ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఆడియన్స్ చూస్తున్నారని శివాజీ అమర్ కి కౌంటర్ వేశాడు.

నన్ను పంపించాలని ఎంత ఎధవ ప్రయత్నాలు చేసినా ఇక్కడే ఉంటా, కప్పు కొట్టుకునే పోతా. ఐ యామ్ బ్యాక్ అంటూ అరిచాడు. ఈ మధ్యలో భోలే, శోభా మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. నువ్వు మనిషివేనా అంటూ శోభా ఫైర్ అయ్యింది. నామినేషన్ ముగిశాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని హెచ్చరించాడు. పాయింట్స్ మాట్లాడేటప్పుడు హద్దులు దాటొద్దు. మాటలు అదుపులో ఉండాలని చెప్పాడు.

ఇక ఈ వారానికి ఎనిమిది మంది నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. అమర్ దీప్, శోభా, ప్రియాంక, శివాజీ, తేజా, భోలే. అశ్విని, గౌతమ్, సందీప్ నామినేట్ అయ్యారు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈసారి టాప్ కంటెస్టెంట్ ఒకరు ఇంటిని వీడటం ఖాయం అనిపిస్తుంది. ఓటింగ్లో శివాజీ దూసుకుపోతుండగా… శోభా వెనుకబడినట్లు సమాచారం.