Homeఎడ్యుకేషన్నిరుద్యోగులకు ఆర్బీఐ శుభవార్త.. రూ.83 వేల వేతనంతో ఉద్యోగాలు..?

నిరుద్యోగులకు ఆర్బీఐ శుభవార్త.. రూ.83 వేల వేతనంతో ఉద్యోగాలు..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 322 ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.rbi.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ముంబైలో ఆర్బీఐ సర్వీసెస్ బోర్డ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మొత్తం 322 ఉద్యోగాలలో ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్‌-బి (డీఆర్‌) జ‌న‌ర‌ల్‌-పీవై 2021 ఉద్యోగాలు 270 ఉండగా కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేష‌న్/ స‌ంబంధిత టెక్నిక‌ల్ స‌బ్జెక్టులు చదివి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్-బీ (డీఆర్‌‌) డీఈపీఆర్‌-పీవై 2021 ఉద్యోగ ఖాళీలు 29 ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీ, పీజీడీఎం/ ఎంబీఏ (ఫైనాన్స్‌) చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్‌-బీ (డీఆర్‌) డీఎస్ఐఎం-పీవై 2021 ఉద్యోగ ఖాళీలు 23 ఉండగా కనీసం 53 శాతం మార్కులతో మాస్ట‌ర్స్ డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

2021 సంవత్సరం జనవరి 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు రూ. 83 వేల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version