Homeఎడ్యుకేషన్కేంద్ర ప్రభుత్వ సంస్థలో 675 ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

కేంద్ర ప్రభుత్వ సంస్థలో 675 ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 675 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. మెకానిక్‌, వెల్డర్‌, టర్నర్‌, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని సమాచారం. ఆగష్టు నెల 16వ తేదీ నుంచి ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేయవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు. https://www.nlcindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

14 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆగష్టు 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు 2021 సంవత్సరం ఆగష్టు 30వ తేదీలోగా దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది.

వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఐటీఐ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular