Woman bites Journalist tongue: అతడు ఒక విలేఖరి. వార్తలను సేకరించడం.. ప్రజల సమస్యలకు వార్త రూపం అందించడం అతడి విధి. జర్నలిజనికే మచ్చ తెచ్చే విధంగా ఆ విలేకరి ప్రవర్తించాడు. అతడు చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనగా మారింది.
ఆ విలేఖరి ఒక ఆటో డ్రైవర్ సహకారంతో ఒక మహిళను హోటల్ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ పని మొదలుపెట్టాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. వారు ముగ్గురు విపరీతంగా మద్యం తాగారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం తాగిన మైకంలో.. ఆ పనిలో ఉండగా.. ఆమె ఆ విలేఖరి నాలుక కొరికినట్టు తెలుస్తోంది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
సంఘటన కడప జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఓ వ్యక్తి స్థానికంగా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అదేపనిగా విలేకరిగా కూడా పని చేస్తూ ఉంటాడు. ఇద్దరికీ ఒక ఆటో డ్రైవర్ తో చాలా సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉంది. అయితే ఇతడికి మొదటి నుంచి కూడా ఒక రకమైన కోరికలు ఉండేవి. వాటిని తీర్చుకోవడానికి తనకు ఒక మహిళ కావాలని ఆ ఆటో డ్రైవర్ ను కోరాడు. ఆటో డ్రైవర్ ఒక మహిళను తీసుకొచ్చాడు. వారు ముగ్గురు ఒంటిమిట్ట ప్రాంతంలో హరిత హోటల్ వెళ్లారు. వాస్తవానికి ఆ హోటల్ నిర్వాహకులు అతడికి రూమ్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. విలేఖరి కావడంతో అతడు ఒత్తిడి తీసుకొచ్చా. ఆ తర్వాత ఆ ముగ్గురు పీకలదాకా మద్యం తాగారు. ఆ తర్వాత ఆ విలేఖరి, ఆ మహిళ పని మొదలుపెట్టారు. అయితే ఆ మహిళ ఆ విలేకరి నాలుకను బలంగా కొరికినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయం కావడంతో రక్తం విపరీతంగా వచ్చింది. దీంతో ఆ విలేకరి భయపడి ఆ మహిళను వదిలేసి వెళ్లిపోయాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. నాలుక రెండు ముక్కలుగా విడిపోవడంతో.. 108 లో కడప రిమ్స్ కు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో ఆ విలేఖరి చికిత్స పొందుతున్నాడు. వైద్యులు నాలుకకు శస్త్ర చికిత్స చేయించారు. దీంతో అతడు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. పోలీసులు ఈ ఘటనపై అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో వదిలేశాడు.
నాలుక కొరికేంత కోపం ఆమెకు ఇతడి మీద ఉందా.. లేక పనిలో ఉద్రేకానికి వెళ్లి అలా కొరికిందా.. అనే ప్రశ్నలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఆ మహిళను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని వారు విచారిస్తున్నారు. హరిత హోటల్ నిర్వాహకులకు పోలీసులు మెమో కూడా జారీ చేశారు.