Hyderabad Temple Incident: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ పెద్ద ఏది చెప్తే అది శాసనంగా ఉండేది. ఫలితంగా మిగతా కుటుంబ సభ్యులు హద్దుల్లో ఉండేవారు. జాగ్రత్తగా మెసలుకునేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఎవరికి వారే అన్నట్టుగా మారిపోతుంది. దీనికి తోడు మనుషుల మధ్య బంధాలు దూరమవుతున్నాయి. తాత్కాలిక సంబంధాల కోసం శాశ్వతమైన బంధాలను దూరం చేసుకోవడానికి మనుషులు తెగబడుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే విలువను కోల్పోయి జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా బంధాలు మరింత పెరిగిపోయాయి.
ఇటువంటి దారుణమైన సంబంధాల వల్ల ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి దోషులను శిక్షిస్తున్నారు. అయినప్పటికీ ఈ తరహా దారుణాలు ఆగడం లేదు. కొందరైతే భర్తలను హద్దులు పెట్టడానికి రకరకాల విధానాలు పాటిస్తున్నారు. చివరికి క్షుద్ర పూజలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇటువంటి సంఘటన హైదరాబాద్ నగర పరిధిలో చోటుచేసుకుంది.image.png
హైదరాబాద్ నగర శివారులో సూర్యగిరి ఎల్లమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రతిరోజు భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాత ఆలయ పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకుని తింటారు. ఈ ఆలయానికి ఒక మహిళ వచ్చింది. ఆమె వయసు 40 లోపు ఉంటుంది. అందరూ అమ్మవారికి మొక్కలు చెల్లిస్తుంటే ఆమె మాత్రం ప్రత్యేకంగా కూర్చుంది. చేతిలో కొబ్బరి చిప్పలు పట్టుకుంది. గాజులు, పసుపు, కుంకుమతో పూజలు చేసింది. చాలాసేపు అలానే కూర్చుంది. పైగా చిత్ర విచిత్రంగా చూపులు చూసింది. దీంతో ఆ ఆలయానికి వచ్చే భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమెను సిబ్బంది అక్కడి నుంచి పంపించారు.
ఆ మహిళ భర్త కొంతకాలంగా వేరే మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు. భార్యను పట్టించుకోవడం లేదు. పిల్లల్ని కూడా సరిగ్గా చూడటం లేదు. దీంతో భర్త ప్రవర్తనతో విసిగి వేసారి పోయిన ఆమె ఇలా ఆలయానికి వచ్చింది. క్షుద్ర పూజల మాదిరిగానే పూజలు చేసింది. తన భర్త వివాహేతర సంబంధం నాశనం కావాలని అమ్మవారిని కోరినట్టు ఆమె అరుపుల ద్వారా తెలిసిందని మిగతా భక్తులు అంటున్నారు. ఆమె వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
