India vs pakistan : ఆటను ఆటలాగా చూడాలి. కానీ దానిని పరువు సమస్యగా చూస్తేనే అసలు ఇబ్బంది. ఇటు మీడియా, అటు క్రికెట్ బోర్డులు భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కు భావోద్వేగాలు జత చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.. ప్రజలు ఉద్రేకాలను పెంచుకొని ఏదేదో చేస్తున్నారు.. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో న్యూయార్క్ వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గెలుపు వాకిట పాకిస్తాన్ బోల్తా పడింది. ముందుగానే చెప్పినట్టు ఉద్రేకాలు తారస్థాయిలో ఉండడంతో ఆయా దేశాలకు చెందిన అభిమానులు.. తమ అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు పాకిస్తాన్ అభిమాని ఏకంగా ఒక ట్రాక్టర్ అమ్మాడు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. దాన్ని మర్చిపోకముందే.. పాకిస్తాన్ ఓడిపోయిందనే బాధతో ఓ సెక్యూరిటీ గార్డ్ ఓ యూట్యూబర్ వ్లాగర్ ను కాల్చి చంపడం సంచలనంగా మారింది. “భారత్ – పాకిస్తాన్ తల పడినప్పుడు ఏదో జరిగిపోతోందన్నట్టుగా విశ్లేషణలు తెరపైకి రావడంతో ప్రజల్లో ఉద్రేకాలు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని” విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
భారత్ – పాకిస్తాన్ తలపడిన రోజు.. పాక్ దేశానికి చెందిన ఫేమస్ యూట్యూబర్ సాద్ అహ్మద్ అనే వ్లాగర్ కరాచీ వెళ్ళాడు. అక్కడ ఓ ప్రధాన మొబైల్ మార్కెట్ ను సందర్శించాడు. అక్కడ అందరితో పిచ్చాపాటి గా మాట్లాడాడు. ఈ సమయంలో క్రికెట్ కు సంబంధించిన చర్చ జరిగింది దానికి సంబంధించి అతడు వీడియో తీస్తుండగా.. ఓ సెక్యూరిటీ గార్డ్ ఎదురయ్యాడు. ఆ సమయంలో భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ గురించి అతనిని అడిగాడు.. అయితే ఆ వీడియోలో ఆ సెక్యూరిటీ గార్డ్ కనిపించేందుకు ఇష్టపడలేదు.. ఇదే విషయాన్ని సాద్ పదేపదే ప్రశ్నించడంతో సెక్యూరిటీ గార్డ్ కు కోపం నషాళానికి అంటింది. గొడవ పెద్దది కావడంతో సెక్యూరిటీ గార్డ్ తన తుపాకీతో సాద్ అహ్మద్ పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పులు జరిపిన వెంటనే సాద్ అహ్మద్ తీవ్రంగా గాయపడటంతో.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రక్తస్రావం కావడం.. కీలక భాగాల్లోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో కాపాడలేకపోయామని వైద్యులు నిస్సహాయతను వ్యక్తం చేశారు.
ఆ యూట్యూబర్ ను చంపిన సెక్యూరిటీ గార్డును కరాచీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాద్ హత్య పాకిస్తాన్ దేశంలో సంచలనం రేపుతోంది. ఆ సెక్యూరిటీ గార్డ్ పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. అయితే మ్యాచ్ ముందు సాద్ వ్లాగ్ చేశాడని కొంతమంది అంటుంటే.. పాకిస్తాన్ ఓటమి దశలో ఉన్నప్పుడు అతడు పదే పదే సెక్యూరిటీ గార్డును ఇబ్బంది.. ఆ ఓటమిని భరించలేక అతడు ఈ పని చేశాడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పాక్ జట్టు ఓటమిలో ఉన్నప్పుడు యూట్యూబర్ ను కాల్చి చంపడం సరికాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు..
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More