Chiranjeevi Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన ఎందరికి తెలిసిందే..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా కావడం తో మెగా అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టు గానే ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది..ఈ సినిమాలో చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఒక్క మాస్ సాంగ్ కి డాన్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..తండ్రి కొడుకులు ఇద్దరినీ ఒక్కే సాంగ్ లో డాన్స్ చెయ్యడం చూసే అభిమానులకు థియేటర్ లో అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది అని ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ అంటున్నాడు..ఈ పాట ఈనెల 20 వ తారీఖున యూట్యూబ్ లో అందుబాటులోకి రానుంది.. గతం లో రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ లో ఒక్క చిన్న బిట్ కి డాన్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిన్న బిట్ కి అప్పట్లో అభిమానులు థియేటర్స్ లో పూనకాలు వచ్చి ఊగిపోయారు..ఇప్పుడు ఏకంగా ఇద్దరు కలిసి వెండితెర మీద 45 నిమిషాల పాటు కనిపించబోతుండడం తో ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి నిన్న మెగా మెగా అభిమానుల్లో కాస్త గందరగోళం జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు వస్తున్నారు అంటూ ప్రచారం సాగడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవి పై విరుచుకుపడ్డారు..సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన మనిషిని ఎలా పిలుస్తావు అంటూ సోషల్ మీడియా లో చిరంజీవి ని టాగ్ చేస్తూ రచ్చ రచ్చ చేసేసారు.
Also Read: Suma: పండుగ పూట కూడా పాత మొగుడేనా.. ఆ షోలో సుమ రెచ్చిపోయిందిగా?
తమ అభిమాన హీరో ని తిడుతున్నందుకు చిరంజీవి ఫాన్స్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులతో వాగ్వాదానికి దిగి నిన్న కాసేపు సోషల్ మీడియా వాతావరణం కాస్త వేడెక్కింది..కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని వైసీపీ పార్టీ స్పోక్స్ పర్సన్ అధికారికంగా తెలియచేయడం తో ఒక్కసారిగా అందరూ చల్లబడ్డారు..అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజా సమాచారం ప్రకారం ఈ నెల 23 వ తారీఖున హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నారు అట…ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు SS రాజమౌళి హాజరు కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..దీనికి సమ్బడినించిన అధికారిక ప్రకటన బయటకి వెలువడాల్సి ఉంది.
ఇక ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక్క వార్త..ఎందుకంటే ప్రస్తుతం ఆయన శంకర్ గారి దర్శకత్వం లో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50 వ చిత్రం గా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమ్రిత్ సర్ లో గత వారం రోజుల నుండి జరుగుతుంది…ప్రస్తుతం ఆ షూటింగ్ లోనే ఆయన బిజీ గా ఉండడం తో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయ్యే అవకాశాలు చాలా తక్కువ గా ఉన్నాయి అట..చూడాలి మరి ఈ ఈవెంట్ కి చివరి నిమిషం లో అయినా రామ్ చరణ్ వస్తాడో రాదో అనేది..ఎంతో భారీగా జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More