Stock Market: స్టాక్ మార్కెట్ ఎందుకు పతనమైంది? ఏవి నష్టపోయాయి? అసలేంటి కారణం?

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోని 30 కంపెనీల్లో 27 కంపెనీల షేర్లు క్షీణించాయి. ఇందులో అతి పెద్ద క్షీణత టాటా మోటార్స్ షేర్‌లో సంభవించింది.

Written By: Neelambaram, Updated On : May 13, 2024 11:31 am

Stock Market

Follow us on

Stock Market: వారం మొదటి రోజు స్టాక్ మార్కెట్ లో మరోసారి భూకంపం కనిపించింది. నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, మార్కెట్ ప్రారంభమైన వెంటనే, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని 30-షేర్ సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోగా, నేషనల్ స్టాక్ నిఫ్టీ కూడా కుప్పకూలింది.

కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిన సెన్సెక్స్..
స్టాక్‌ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్‌ నష్టాలతో ప్రారంభమైంది. BSE సెన్సెక్స్ 239.16 పాయింట్లు పడిపోయి 72,425.31 వద్ద ప్రారంభమైంది. గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం 72,664.47 వద్ద ముగిసింది. ఈ పతనం కేవలం 5 నిమిషాలే కనసాగింది. ఉదయం 9.50 గంటలకు, BSE సెన్సెక్స్ 71,921.87 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది, 743.60 పాయింట్లు లేదా 1.02 శాతం పడిపోయింది.

నిఫ్టీలోనూ భారీ పతనం
సెన్సెక్స్ మాదిరిగానే, షేర్ మార్కెట్ నిఫ్టీ (నిఫ్టీ 50) రెండో సూచీ కూడా 100 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇది గత ముగింపు స్థాయి 22,055 నుంచి 58.70 పాయింట్లు క్షీణించి 21,996.50 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. వార్త రాసే సమయానికి 222.90 పాయింట్లు లేదా 1.01 శాతం క్షీణతతో 21,832.30 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ మార్కెట్ లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంతో 1472 షేర్లు లాభపడగా, 1026 షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 183 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

టాటాకు చెందిన ఈ రెండు షేర్లు పడిపోయాయి
బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోని 30 కంపెనీల్లో 27 కంపెనీల షేర్లు క్షీణించాయి. ఇందులో అతి పెద్ద క్షీణత టాటా మోటార్స్ షేర్‌లో సంభవించింది. ఇది 7.88 శాతం పడిపోయి రూ. 964.35కు చేరుకుంది. ఇతర లార్జ్ క్యాప్ కంపెనీల గురించి మాట్లాడితే, టాటా స్టీల్ షేర్ 2.28 శాతం క్షీణతతో రూ.158.65 వద్ద ట్రేడవుతోంది. ఇది కాకుండా, JSW స్టీల్ షేరు 2.24 శాతం పడిపోయి రూ.834.65 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈ షేర్లు కూడా పడిపోయాయి..
మిడ్‌క్యాప్ కంపెనీల విషయానికి వస్తే, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 10.48 శాతం క్షీణించి రూ.124.30కి, యూనియన్ బ్యాంక్ షేరు 6.76 శాతం క్షీణించి రూ.132.45కి, పీఈఎల్ షేర్ 4.15 శాతం తగ్గి రూ.812.45 వద్ద ట్రేడ్ అవుతోంది.

ప్రారంభ ట్రేడింగ్‌లో స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లు అతిపెద్ద క్షీణతను చవిచూశాయి. వాటిలో, న్యూలాండ్‌ ల్యాబ్ షేర్ 12.97 శాతం క్షీణించి రూ. 6208.90 వద్ద ఉండగా, SOTL షేర్ 11.37 శాతం పతనంతో రూ. 496 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది కాకుండా, రీస్పోనిండ్ షేర్ కూడా 8.57 శాతం పడిపోయి రూ.264.05కి చేరుకుంది.

ET నివేదిక ప్రకారం, ప్రధానంగా ఆటో మరియు ఐటీ రంగాల్లో బలహీనత, అలాగే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు, పెరిగిన అస్తిరత కారణంగా క్షీణత నమోదైంది. ఇండియా VIX, మార్కెట్ అస్థిరత యొక్క కొలమానం, 14 శాతం పెరిగింది.