Homeబిజినెస్Real Estate : పండుగల సీజన్లో లగ్జరీ హౌసులను తెగ కొనేస్తున్న జనాలు కారణం ఇదే...

Real Estate : పండుగల సీజన్లో లగ్జరీ హౌసులను తెగ కొనేస్తున్న జనాలు కారణం ఇదే !

Real Estate : భారతదేశం హై-ఎండ్ రియల్ ఎస్టేట్ రంగం 2024లో ఆకట్టుకునే వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉంది. ఈ కాలంలో రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీలు గణనీయమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అయిన గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్( CBRE) నివేదిక ప్రకారం.. జనవరి నుండి సెప్టెంబర్ 2024 వరకు ఈ ప్రాంతంలో విక్రయాలు సంవత్సరానికి 37.8శాతం పెరిగాయి. ఈ కాలంలో 12,625 లగ్జరీ యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇది 9,160 యూనిట్లకు పైగా ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ ఈ వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి. మొదటి ఏడు నగరాల మొత్తం అమ్మకాలలో ఈ నగరాలు దాదాపు 90శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఢిల్లీ-NCR ఈ కాలంలో లగ్జరీ అమ్మకాలను 5,855 యూనిట్ల విక్రయాలతో, ఏడాది ప్రాతిపదికన 72శాతం వృద్ధిని సాధించింది. ముంబైలో 3,820 యూనిట్లు విక్రయించబడ్డాయి, ఇది 18శాతం వృద్ధిని సూచిస్తుంది. పుణె కూడా 810 యూనిట్ల విక్రయాలతో గణనీయమైన వృద్ధిని సాధించింది. విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్ వెనుక ఉన్న ప్రధాన కారణం జీవనశైలికి అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు, విశాలమైన నివాస స్థలాల వైపు సంపన్న కొనుగోలుదారులు పెరుగుతున్న ప్రాధాన్యత. ఇది కాకుండా, పెరుగుతున్న ఎన్‌ఆర్‌ఐలు (నాన్-రెసిడెంట్ ఇండియన్స్) , దేశీయ పెట్టుబడిదారుల సంఖ్య కూడా ఈ విభాగానికి డిమాండ్‌ను పెంచింది.

గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్( CBRE) చైర్మన్ అండ్ సీఈవో అన్షుమాన్ మాట్లాడుతూ.. 2024 మొదటి అర్ధభాగంలో బలమైన పనితీరు, పండుగ సీజన్‌లో పెరుగుదల కారణంగా, ఈ సంవత్సరం అమ్మకాలు, కొత్త లాంచ్‌లు రెండూ వరుసగా రెండవ సంవత్సరం 300,000 యూనిట్లను దాటుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయితే, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. విక్రయించబడని ఇన్వెంటరీ, ప్రాజెక్ట్ నాణ్యత, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత వంటి అంశాలు ప్రాపర్టీ డిమాండ్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, హై-ఎండ్, ప్రీమియం సెగ్మెంట్లలో డిమాండ్ కొనసాగుతుందని భావిస్తున్నారు.

గత మూడేళ్లలో పెద్ద మార్పు
అసెట్జ్ ప్రాపర్టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ పరీక్ ప్రకారం.. భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత 2-3 సంవత్సరాలలో లగ్జరీ, అల్ట్రా-లగ్జరీ హౌసింగ్ విభాగంలో ఘణనీయమైన మార్పును సాధించింది. ఇంతకుముందు సరసమైన గృహాలు కీలకంగా ఉన్న చోట, ఇప్పుడు లగ్జరీ హౌసింగ్ కీలకంగా మారుతోంది. బెంగుళూరుకు చెందిన జెన్‌ఎక్స్‌చగ్స్ వ్యవస్థాపకుడు విజయ్ చుగాని మాట్లాడుతూ… కొనుగోలుదారులలో ప్రీమియం గృహాలకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ సిద్ధంగా ఉన్న విలాసవంతమైన ఆస్తులు పూర్తిగా అమ్ముడయ్యాయని చెప్పారు. అధిక-నికర-విలువ గల వ్యక్తులు వారి జీవినశైలికి అనుగుణంగా లగ్జరీ హౌసుల వైపు చూస్తున్నారు.

 

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular