AC Prices Increase In India 2026: భారత దేశంలో వేసవి కాలం మొదలవుతోంది. ఫిబ్రవరిలోనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈసారి ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తరుణంలో వేసవి మార్కెట్ మొదలైంది. ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్లు, ఏసీల కొనుగోలు ఊపందుకుంది. అయితే ఈ వేసవిలో ఎయిర్ కండిషనర్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వోల్టాస్ ఎండీ ముకుందన్ మేనన్ తెలిపారు. మెటల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, కొత్త శక్తి సామర్థ్య నియమాల కారణంగా ధరలు 5 నుంచి 15 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు.
మెటల్ ధరల ప్రభావం..
దేశంలో ప్రస్తుతతం రాగి ధర టన్నుకు 13 వేల డాలర్లకు చేరడంతో ఏసీల్లో ముఖ్య భాగాలైన కాయిల్స్, కనెక్టర్ల తయారీ ఖర్చు భారీగా పెరిగింది. ఏసీ బాడీ, ఫ్రేమ్లకు వాడే అల్యూమినియం, స్టీల్ రేట్లు కూడా 10 నుంచి 20 పెరిగాయి. ఇక దిగుమతి విడిభాగాల ధరలు కూడా పెరిగాయి.
కొత్త నియమాలు ఇలా..
జనవరి 2026 నుంచి అమలయ్యే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మార్గదర్శకాలు 3–స్టార్ ఏసీల ధరలు 3 నుంచి 4 శాతం, 5–స్టార్ మోడళ్ల ధర 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇక ఏ2ఎల్ రిఫ్రిజరెంట్ గ్యాస్ వాడాలని, ఇన్వర్టర్ కంప్రెసర్లు అధిక సామర్థ్యంగా ఉండాలనే నిబంధనలు తయారీదారులపై అదనపు భారాన్ని వేస్తున్నాయి. పాత మోడళ్లు మార్కెట్కు దూరమవుతున్నాయి.
తయారీదారుల ప్రణాళిక
వోల్టాస్, బ్లూ స్టార్, డైకిన్ వంటి కంపెనీలు ధరలు జనవరి–ఫిబ్రవరి నుంచి దశలవారీగా పెంచుతాయి. 1.5 టన్ 5–స్టార్ ఏసీ ధర రూ.45 వేల నుంచి రూ.52 వేలు, ఒక టన్ మోడల్స్ ధర రూ.35 వేల నుంచి రూ.40 వేలకు పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం ఫీచర్లు (ఏసీ కూలింగ్, 2.5 ఫిల్టర్లు) ధరలు మరింత పెరుగుతాయి.
అమ్మకాలూ పెరిగే ఛాన్స్..
ధరలు పెరగినా వేసవి డిమాండ్తో 20–25% అమ్మకాల పెరుగతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. గతేడాది 3 కోట్ల ఏసీలు అమ్ముడయ్యాయి, ఇప్పుడు 3.6–4 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 15% వృద్ధి ఉంటుందని అంచనా. ఇన్వర్టర్ మోడల్స్కు ఎక్కువ ఆదరణ వస్తుంది.