Homeబిజినెస్Students : విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. రూ.2000 పొందే ఛాన్స్?

Students : విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. రూ.2000 పొందే ఛాన్స్?


కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయకుండా వేర్వేరు కారణాల వల్ల చదువుకు దూరమైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలుస్తోంది. 16 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.

అయితే డిస్టెన్స్ విధానంలో పది, ఇంటర్ చదువుకుంటే మాత్రమే ఈ పథకానికి అర్హత పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ పేరుతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా సంవత్సరానికి 2,000 రూపాయల ప్రొత్సాహం అందించనుందని తెలుస్తోంది. ఈ ఏడాది నుంచే ఈ స్కీమ్ అమలు కానుందని సమాచారం. అయితే కేంద్రం నేరుగా ఈ డబ్బును విద్యార్థుల చేతికి ఇస్తే ఆ డబ్బును వాళ్లు ఇతర అవసరాలకు వాడవచ్చని భావిస్తోంది.

అధికారులు ఆ డబ్బును విద్యార్థులకు ఏ విధంగా ఇస్తే మంచిదో అని ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారని త్వరలో ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను కేంద్రం ప్రకటించనుందని సమాచారం. ఈ పథకం అమలు ద్వారా చాలామంది విద్యార్థులు దూరవిద్య ద్వారా అడ్మిషన్ తీసుకునే అవకాశాలు సైతం ఉంటాయి. త్వరలో ఈ పథకం అమలు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.

కేంద్రం ఈ పథకం ద్వారా రూ.2000 ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు ప్రశంసిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక విద్యాపీఠాల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. విద్యార్థుల అక్షరాస్యత రేటును పెంచడానికి కేంద్రం ఈ స్కీమ్ లను అమలు చేస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular