Vodafone Idea Shares: నోకియా, ఎరిక్సన్, శామ్సంగ్ 4జీ నెట్వర్క్ విస్తరణ, 5జీ రోల్ అవుట్ల కోసం మూడేళ్లలో టెలికాం పరికరాలను సమకూర్చుకునేందుకు 3.6 బిలియన్ డాలర్ల (రూ. 30,000 కోట్లు) విలువైన ఒప్పందాలు వొడాఫోన్-ఐడియా కంపెనీ కుదుర్చుకున్నట్లు కంపెనీ ఆదివారం ప్రకటించింది. దీంతో వొడాఫోన్-ఐడియా షేర్లు 9.93 శాతం పెరిగి రూ. 11.61 వద్ద గరిష్టానికి చేరుకున్నాయి. దాని బలమైన ప్రత్యర్థులు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ ను ఢీ కొనేందుకు మార్కెట్లో తన పోటీతత్వాన్ని మెరుగుపర్చుకునేందుకు, వినియోగదారుల నష్టాలను నివారించేందుకు ఈ ఒప్పందం ముఖ్యమైన అడుగు. వొడాఫోన్ ఐడియా మూడేళ్ల వ్యవధిలో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం నోకియా, ఎరిక్సన్, శామ్సంగ్ తో 3.6 బిలియన్ డాలర్ల మెగా ఒప్పందం కుదుర్చుకుంది. 6.6 బిలియన్ డాలర్ల (రూ. 550 బిలియన్లు) కంపెనీ పరివర్తనాత్మక మూడేళ్ల కాపెక్స్ ప్రణాళికను అమలు చేసే దిశలో ఈ ఒప్పందం మొదటి అడుగుగా పడింది. 4జీ జనాభా కవరేజీని 1.03 బిలియన్ల నుంచి 1.2 బిలియన్లకు విస్తరించడం.. కీలక మార్కెట్లలో 5జీని ప్రారంభించడం, డేటా వృద్ధికి అనుగుణంగా సామర్థ్య విస్తరణ లక్ష్యంగా కాపెక్స్ ప్రోగ్రామ్ ను రూపొందించారు. ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక భాగస్వాములైన నోకియా, ఎరిక్సన్ తో పాటు శామ్సంగ్ను కొత్త భాగస్వామిగా చేర్చుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది.
ఇటీవల షేర్ల విక్రయం ద్వారా రూ. 24,000 కోట్లు సమీకరించిన సంస్థ, రూ. 55,000 కోట్ల ‘పరివర్తనాత్మక (Transformative)’ మూడేళ్ల క్యాపెక్స్ ప్రణాళికను అమలు చేసే దిశగా ఈ ఒప్పందం తొలి అడుగు అని కంపెనీ పేర్కొంది. 4జీ కవరేజీని 1.03 బిలియన్ల నుంచి 1.2 బిలియన్లకు విస్తరించడం, కీలక మార్కెట్లలో 5జీని ప్రారంభించడం, డేటా వృద్ధికి అనుగుణంగా సామర్థ్య విస్తరణను సులభతరం చేయడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం.
నిర్ధిష్ట ఒప్పందాల గురించి కంపెనీ వివరించనప్పటికీ, ఎరిక్సన్, నోకియాకు 40% కేటాయించే అవకాశం ఉంది, మిగిలిన 20% శామ్సంగ్ కు వెళుతుంది. వచ్చే త్రైమాసికంలో నెట్వర్క్ డీల్స్ కింద సరఫరాలు ప్రారంభమవుతాయని, 4జీ కవరేజీని విస్తరించడం కంపెనీ మొదటి ప్రాధాన్యతగా భావిస్తున్నారు. ప్రత్యర్థి భారతీ ఎయిర్ టెల్ కూడా తన 4జీ కవరేజీని విస్తరించేందుకు మూడేళ్లలో కాపెక్స్ లో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
ప్రథమార్థంలో ఆర్థిక సేవలకు అత్యధిక విదేశీ పెట్టుబడులు ఏజీఆర్ కేసులో టెలికాం ఆపరేటర్ల పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం, ఏజీఆర్ డిమాండ్ పూర్తి మొత్తాన్ని సమర్థించడంతో స్టాక్ పతాక శీర్షికల్లో నిలిచింది. దీంతో కంపెనీపై రూ. 58,000 కోట్ల భారం పడింది. వడ్డీతో కలిపి 2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఆ భారం రూ. 70,320 కోట్లకు పెరిగింది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More