Homeబిజినెస్బైక్ కొనేవాళ్లకు శుభవార్త.. ఏకంగా రూ.28వేలు తగ్గింపు..?

బైక్ కొనేవాళ్లకు శుభవార్త.. ఏకంగా రూ.28వేలు తగ్గింపు..?

మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. బైక్ కొనుగోలుపై ఏకంగా 28వేల రూపాయలు తగ్గింపు పొందే అవకాశం అయితే ఉంటుంది. బైక్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రముఖ వాహన తయారీ కంపెనీలలో ఒకటైన రివోల్ట్ మోటార్స్ ఈ ఆఫర్ ను అందిస్తోంది.

ఎలక్ట్రిక్ బైక్ ఆర్‌వీ400 ధరను ఏకంగా 28,201 రూపాయలు తగ్గించింది. పాపులర్ బైక్ లలో ఒకటైన ఈ బైక్ ధర తగ్గడం వల్ల వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈ బైక్ కస్టమర్లకు అందుబాటు ధరలో లభ్యమవుతూ ఉండటం గమనార్హం. తగ్గింపు ధర వల్ల కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. తాజా రేటు తగ్గింపు వల్ల బైక్ ధర ఏకంగా రూ.90,799కు దిగొచ్చింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఫేమ్ 2 సబ్సిడీ స్కీమ్‌లో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. సబ్సిడీ స్కీమ్ మార్పుల వల్ల బైక్ ధరలు భారీగా తగ్గడం గమనార్హం. గతంలో ఈ బైక్ ధర 1,19,000 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం తగ్గింపు ధరలు అమలులోకి వచ్చాయి. ఈ బైక్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉండటం గమనార్హం. ఈ బైక్ లో 3 కేడబ్ల్యూ మోటార్ ఉండటంతో పాటు 72వీ 3.24 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది.

ఈ బైక్ ను కొనుగోలు చేసిన వాళ్లు బైక్ పై గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ బైక్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉండటం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version