Oil Prices: సామాన్యులకు తీపికబురు.. భారీగా తగ్గనున్న వంటనూనెల ధరలు?

Oil Prices: గత కొన్ని నెలలుగా అంతకంతకూ పెరుగుతున్న వంటనూనె ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వంటనూనె ధరలను తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుభాశ్ పాండే సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తీపికబురు అందించారు. డిసెంబర్ నెల నుంచి వంటనూనె ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని సుభాశ్ పాండే చెప్పుకొచ్చారు. డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్ లో సైతం […]

Written By: Navya, Updated On : September 5, 2021 7:11 pm
Follow us on

Oil Prices: గత కొన్ని నెలలుగా అంతకంతకూ పెరుగుతున్న వంటనూనె ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వంటనూనె ధరలను తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుభాశ్ పాండే సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తీపికబురు అందించారు. డిసెంబర్ నెల నుంచి వంటనూనె ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని సుభాశ్ పాండే చెప్పుకొచ్చారు.

డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్ లో సైతం వంటనూనె ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని సుభాష్ పాండే పేర్కొన్నారు. సంవత్సర కాలంలో వంటనూనె ధరలు ఏకంగా 64 శాతం మేర పెరగడం గమనార్హం. వంటనూనె ధరలు పెరగడంతో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు సైతం ఊహించని స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగడం వల్ల కూడా వంటనూనె ధరలు పెరిగాయి.

ప్రజలలో చాలామంది వంటకాల కోసం సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు గ్రౌండ్ నట్ ఆయిల్ ను వినియోగిస్తారు. ఈ రెండు వంటనూనెల ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. పామాయిల్ విక్రయ ధర 64 శాతం పెరగగా సోయాబిన్ ఆయిల్ ధర 51.2 శాతం పెరిగింది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర, ఆవ నూనె ధర, గ్రౌండ్ నట్ ఆయిల్ ధర 46 శాతం పెరుగుదలతో లీటర్ 150 రూపాయలకు చేరుకున్నాయి.

ధరలు భారీగా తగ్గాలని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వంటనూనెలపై సుంకాలను తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేయాలని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు.