డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్ లో సైతం వంటనూనె ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని సుభాష్ పాండే పేర్కొన్నారు. సంవత్సర కాలంలో వంటనూనె ధరలు ఏకంగా 64 శాతం మేర పెరగడం గమనార్హం. వంటనూనె ధరలు పెరగడంతో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు సైతం ఊహించని స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగడం వల్ల కూడా వంటనూనె ధరలు పెరిగాయి.
ప్రజలలో చాలామంది వంటకాల కోసం సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు గ్రౌండ్ నట్ ఆయిల్ ను వినియోగిస్తారు. ఈ రెండు వంటనూనెల ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. పామాయిల్ విక్రయ ధర 64 శాతం పెరగగా సోయాబిన్ ఆయిల్ ధర 51.2 శాతం పెరిగింది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర, ఆవ నూనె ధర, గ్రౌండ్ నట్ ఆయిల్ ధర 46 శాతం పెరుగుదలతో లీటర్ 150 రూపాయలకు చేరుకున్నాయి.
ధరలు భారీగా తగ్గాలని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వంటనూనెలపై సుంకాలను తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేయాలని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు.