spot_img
Homeబిజినెస్New Ookla CEO : సీఈవో అంటే నువ్వు స్వామి.. నీలాంటోడు కంపెనీకి ఒకడుండాలి

New Ookla CEO : సీఈవో అంటే నువ్వు స్వామి.. నీలాంటోడు కంపెనీకి ఒకడుండాలి

New Ookla CEO : కార్పొరేట్ కంపెనీలు వేలకోట్ల టర్నోవర్ సాగిస్తుంటాయి కాబట్టి.. వ్యాపార విస్తరణను పెంచుకుంటాయి కాబట్టి.. అన్ని విభాగాలలో సత్తా చాటే సీఈఓలను నియమించుకుంటాయి. పేరుపొందిన విశ్వవిద్యాలయాలలో చదివిన వారికి కార్పొరేట్ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్లో గొప్ప గొప్ప కాలేజీల్లో చదువుకున్న వారికి ఊహించనంత స్థాయిలో వేతనాలు ఇచ్చి నియమించుకుంటాయి. కంపెనీలు ఆ స్థాయిలో వేతనాలు ఇస్తాయి కాబట్టే.. సేవలు కంపెనీలకు నమ్మిన బంటు లాగా ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో ఓ కంపెనీ సీఈవో తన పనితీరును సరికొత్తగా నిరూపించుకున్నారు. తన కంపెనీలో ఓ వృద్ధుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణమైన ఉద్యోగులపై అత్యంత కఠినంగా వ్యవహరించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చినట్టుగా.. పనిష్మెంట్ ఇచ్చారు. ఏకంగా 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని సూచించారు..

ఇంతకీ ఏం జరిగిందంటే

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో న్యూ ఓక్లా పేరుతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనే పేరుతో ఓ సంస్థ ఉంది. ఇందులో 16 మంది విధులు నిర్వహిస్తున్నారు.. ఈ సంస్థలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి నోయిడా ప్రజలు వస్తుంటారు. ఈ అథారిటీకి సరిగ్గా గత ఏడాది క్రితం ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేష్ సీఈవోగా నియమితులయ్యారు.. విధి నిర్వహణలో ఎంతో నిక్కచ్చిగా ఉండే ఈయన.. ఏమాత్రం అసౌకర్యం కలిగినా సహించరు.. వృద్ధుల విషయంలో ఆయన ఎంతో ఉదారత చూపిస్తుంటారు. వృద్ధులను ఎక్కువసేపు నిలబడితే ఊరుకోరు. వృద్ధులకు అందిస్తున్న సేవలను.. ఒకవేళ సేవలను లోపాలు తలెత్తితే పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు చూస్తుంటారు. డిసెంబర్ 16, సోమవారం నాడు ఓక్లా కార్యాలయానికి ఓ వృద్ధుడు వచ్చాడు. తన పని నిమిత్తం కౌంటర్ వద్ద నిలబడ్డాడు.. ఆ విషయాన్ని లోకేష్ సీసీ కెమెరాలు చూశాడు. ఆయనకు కావలసిన పనిని చేసిపెట్టాలని లోకేష్ ఓ మహిళా ఉద్యోగికి సూచించారు. ఆ పని సాధ్యం కాకపోతే.. వెంటనే ఆ వృద్ధుడికి చెప్పాలని సూచించారు. లోకేష్ ఇలా చెప్పి 20 నిమిషాలు గడిచినప్పటికీ.. ఆ వృద్ధుడు కౌంటర్ వద్ద నిలబడ్డాడు. దీంతో ఆ సీఈవో ఆ విషయాన్ని మొత్తం గమనించారు. వెంటనే కార్యాలయం వద్దకి వేగంగా వచ్చారు. వెంటనే అటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని సూచించారు. వారు నిలబడి పనిచేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వ్యాప్తిలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ కార్యాలయాలలో వెంటనే ఉద్యోగులు స్పందించాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper