Homeబిజినెస్Kia : అమ్మకాల్లో దూసుకుపోతున్న కియా కార్లు.. కారణం ఇదే..

Kia : అమ్మకాల్లో దూసుకుపోతున్న కియా కార్లు.. కారణం ఇదే..

Kia : భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చిన దానిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు కారులో ఉన్నవారు సైతం వాటి స్థానంలో కొత్త వాటిని చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కంపెనీలు వినియోగదారుల డిమాండ్ కు తగిన విధంగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటిలో దక్షిణ కొరియా కంపెనీకి చెందిన KIA అమ్మకాల్లో మెల్లగా దూసుకుపోతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కియా కు చెందిన కొన్ని కార్ల అమ్మకాలు పెరిగాయి. ఈ కంపెనీకి చెందిన కార్లలో ఉండే ఫీచర్లతో పాటు.. ఆకర్షణీయమైన డిజైన్ ఏ అందుకు కారణం అని తెలుస్తుంది. అయితే కియా కార్లు ఎన్ని వికలాయాలు జరుపుకున్నాయి? ఆ వివరాలు కి వెళ్తే..

Also Read : కొత్త రికార్డు సృష్టించిన ‘కియా’..

Kia కంపెనీ భారత దేశంలో 2019లో అడుగు పెట్టింది. ఇది అడుగుపెట్టిన అది తక్కువ కాలంలోనే వినియోగదారులను ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఏర్పాటు చేసిన కర్మాగారం నుంచి ఈ అధికారులు దేశవ్యాప్తంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. ఈ కంపెనీకి చెందిన కార్లు ఈ ఏడాది ఏప్రిల్ లో దేశవ్యాప్తంగా 23,623 యూనిట్లు విక్రయాలు జరుపుకున్నాయి. మిగతా కాళ్లతో పోలిస్తే ఇది తక్కువే అయినా.. గత ఏడాదితో పోలిస్తే విక్రయాల శాతం పెరిగిందని తెలుస్తోంది. 2024 ఏడాది ఏప్రిల్ లో కియా కార్లు దేశంలో 19,968 యూనిట్లు విగ్రహాలు జరుపుకున్నాయి. అయితే ఈ ఏడాది కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించాయి.

కియా కంపెనీకి చెందిన సిరిస్, కార్నివాల్ limousin అనే కొత్త కార్లు ఈ ఏడాదిలో మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీడి అమ్మకాలు గరినీయంగా పెరిగాయి. అయితే ఈ కంపెనీకి చెందిన ఇప్పటికే మార్కెట్లో గుర్తింపు పొందిన సోనేటో కారు అమ్మకాలు కూడా ఏప్రిల్ నెలలో పెరగడం విశేషం. గత ఏప్రిల్ లో సోనీ కారును 8,068 మంది కొనుగోలు చేశారు. ఈ కారు తర్వాత సెల్తోస్ రెండో స్థానంలో నిలిచింది. కియా సెల్టోస్ 6,135 యూనిట్ల విగ్రహాలు జరిగాయి.

Also Read : కియా సోనెట్ కొత్త మోడల్ చూశారా? ఫీచర్స్ అదిరిపోయాయి..

కియా కంపెనీకి చెందిన కొత్త కార్ల విషయానికి వస్తే.
MPV సెగ్మెంట్లో వచ్చిన Carans కారును 2025 ఏప్రిల్ లో 5,259 మంది కొనుగోలు చేశారు. ఆ తర్వాత రెండో స్థానంలో Syros కారు నిలిచింది. ఈ కారు 4000 యూనిట్లు విక్రయాలు జరిగాయి. ఇండియాలో అత్యంత ఖరీదైన లగ్జరీకారుగా కార్నివాల్ limousin నిలిచింది. ఇది గత ఏప్రిల్ లో 161 యూనిట్లు అమ్ముడు పోయింది.

ఇలా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ కియా కార్లు నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతుంది. అయితే కొత్త కార్లతో కియా అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించేందుకు మార్కెట్లోకి నూతన కాలనీ తీసుకుని వస్తే కియా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో సోనేట్ వంటి కార్లు కూడా అదనపు బలాన్ని ఇస్తున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular