https://oktelugu.com/

వాహనదారులకు కేంద్రం శుభవార్త.. ఆ గడువు పొడిగింపు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు తీపికబురు అందించింది. మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, ఇతర పత్రాలకు సంబంధించిన గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించడం వల్ల వాహనదారులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. Also Read: క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకు శుభవార్త.. ఇలా చేస్తే లాభం..? కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి గడువును మరోమారు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 27, 2021 / 12:23 PM IST
    Follow us on

    Driving Licence Validity Extended

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు తీపికబురు అందించింది. మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, ఇతర పత్రాలకు సంబంధించిన గడువును మరోసారి పొడిగించింది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించడం వల్ల వాహనదారులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

    Also Read: క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకు శుభవార్త.. ఇలా చేస్తే లాభం..?

    కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి గడువును మరోమారు పొడిగిస్తున్నట్టు అన్ని రాష్ట్రాలకు లేఖలు అందాయి. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాహనదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కేంద్రం 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి నెల 31వ తేదీ మధ్య గడువు పూర్తయ్యే పత్రాలకు మాత్రమే ఈ ప్రయోజనాలను అందిస్తోంది.

    Also Read: 170 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

    గతేడాది గడువు ముగిసిన ధ్రువీకరణ పత్రాలు ఈ ఏడాది జూన్ నెల 30వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇప్పటికే కేంద్రం ఈ గడువును నాలుగుసార్లు పొడిగించగా తాజాగా మరోసారి కేంద్రం ఈ గడువును పొడిగించడం గమనార్హం. శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వాహనదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

    ప్రజలు రవాణాకు సంబంధించిన సేవల విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్టు కేంద్రం చెబుతోంది. వెహికల్ ఫిట్‌నెస్, ఇతర పత్రాలకు సంబంధించి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.