విజయవాడలో యువతిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి

యువతి ప్రేమించలేదంటూ ఓ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందిన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని క్రీస్తురాజుపురలో ఓ యువకుడు దివ్య తేజస్విని అనే యువతి ఇంటికి వెళ్లి ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా యువుకుడు సైతం తనను […]

Written By: Suresh, Updated On : October 15, 2020 1:38 pm

murderd

Follow us on

యువతి ప్రేమించలేదంటూ ఓ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందిన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని క్రీస్తురాజుపురలో ఓ యువకుడు దివ్య తేజస్విని అనే యువతి ఇంటికి వెళ్లి ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా యువుకుడు సైతం తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. గాయపడిన యువకుడిని ఇదే అసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటనపై మాచవరం పోలీస్‌స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.