ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. కడప జిల్లా మైదకూరు నుంచి కాకినాడకు టమాటాల లోడుతో ఓ లారీ వెళ్తోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురం జాతీయరహదారిపై శనివారం ఉదయం ఈ లారీ బైక్ ను ఢీకొట్టింది. దీంతో గాపాలపురం గ్రామానికి చెందిన సతీష్, చంటి, కొత్తపేట మండలం కండిగ గ్రామానికి చెందిన సరేందర్ లు అక్కడికక్కడే మృతి […]

Written By: Suresh, Updated On : January 2, 2021 9:36 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. కడప జిల్లా మైదకూరు నుంచి కాకినాడకు టమాటాల లోడుతో ఓ లారీ వెళ్తోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురం జాతీయరహదారిపై శనివారం ఉదయం ఈ లారీ బైక్ ను ఢీకొట్టింది. దీంతో గాపాలపురం గ్రామానికి చెందిన సతీష్, చంటి, కొత్తపేట మండలం కండిగ గ్రామానికి చెందిన సరేందర్ లు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.