తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రోడ్లు: మొత్తం 9 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రోడ్లు రక్తసిక్తమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని గూడూరు సమీపంలో బుధవారం ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో సి.బెళగల్ మండలం బ్రాహ్మణ పల్లి కి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు […]

Written By: Suresh, Updated On : December 2, 2020 10:11 am
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రోడ్లు రక్తసిక్తమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని గూడూరు సమీపంలో బుధవారం ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో సి.బెళగల్ మండలం బ్రాహ్మణ పల్లి కి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తెలంగాణలో రోడ్డు రక్తసిక్తమైంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సికింద్రాబాద్ తాడ్ బండ్ కు చెందిన ఇన్నోవా కారులో ప్రయాణిస్తుండగా చేవెళ్ల మండలం మల్కాపూర్ శివారులో బుధవారం ఉదయం బోర్ వెల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ తో సహా ఆరుగురు మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మ్రుతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.