ఆంధ్రప్రదేశ్లో మంగళవారం భారీ వర్షాలున్నాయని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. విశాఖ, తూర్పు గోదావరిన, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో వర్షాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం , ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లల్లో పలుచోట్ల తేలిక పాటి వర్షాలుంటాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడం మధ్యాహ్నం వరకు తీరం దాటనుందన్నారు. ముందు జాగ్రత్తగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపారు.