https://oktelugu.com/

2022 నాటికి పోలవరం పూర్తి: సీఎం జగన్

2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం నిర్మాణాల వద్దకు చేరుకొని స్పిల్ వే, స్పిల్ ఛానల్, నిర్మాణ అంశాలపై ఆరా తీశారు. అనుకున్న సమయానికే పోలవరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో 2022 నాటికి రైతులకు పోలవరం నీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పిల్ వే […]

Written By: , Updated On : December 14, 2020 / 01:35 PM IST
Follow us on

2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం నిర్మాణాల వద్దకు చేరుకొని స్పిల్ వే, స్పిల్ ఛానల్, నిర్మాణ అంశాలపై ఆరా తీశారు. అనుకున్న సమయానికే పోలవరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో 2022 నాటికి రైతులకు పోలవరం నీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పిల్ వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అలాగే కాఫర్ డ్యాం వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సీఎం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.