
ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు చాలాకాలంగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని అన్నారు. గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారని, ఆయనకు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.