ఆంధ్రప్రదేశ్ లో ఎట్టకేలకు సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. తెరమీద బొమ్మ పడడంతో సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంలో దాదాపు ఆరు నెలలుగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఆన్ లాక్ ప్రకటించిన తరువాత 50 శాతం సీట్లతో థియేటర్లు ప్రారంభించుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే ఈ 50 శాతం సీట్లతో వర్క్ అవుట్ కాదని థియేటర్ల యజమానులు ఒప్పుకోలేదు. కానీ మరోసారి సమావేశం నిర్వహించి చివరికి థియేటర్లను ప్రారంభించారు. విజయవాడలోని గాంధీనగర్లోని ఐమాక్స్, అశోక్ నగర్ లోని సినీ పోలీస్ మల్టీఫ్లెక్స్ లో ఒక్కో స్క్రీన్ తెరిచారు. అయితే ప్రేక్షకులను భట్టి థియేటర్లను దీపావళి వరకు ప్రారంభిస్తామని యజమానులు తెలిపారు.