ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం శాంతి శ్రేయస్సును పెంపొందించి దేశం గర్వపడేలా చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య తెలిపారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్షా ‘భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ చేసిన కృషి అపారమని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని’ ట్వీట్ చేశారు.