ఒకే ఇంట్లో ఐదుగురు మిస్సింగ్ :నెల్లూరులో కలకలం

నెల్లూరు జిల్లాలో ఒకే ఇంట్లో ఐదుగురు కనిపించకుండా పోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని వెంకటగిరి మండలం జికే పల్లి గ్రామంలో ఇద్దరు తోడి కోడళ్లు, ముగ్గురు పిల్లలు అద్రుశ్యమయ్యారు. ఇద్దరు తోడి కోడళ్లు వారి పిల్లలను నిన్న మధ్యాహ్నం ఆసుప్రతికి తీసుకెళ్లిన వారి మళ్లీ కనిపించకుండా పోయారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అద్రుశ్యమైన వారి కోసం గాలిస్తున్నారు. కొన్ని రోజులుగా మిస్సింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి.  పోలీసులు కొన్నింటిని చాకచక్యంగా […]

Written By: NARESH, Updated On : November 17, 2020 12:22 pm
Follow us on

నెల్లూరు జిల్లాలో ఒకే ఇంట్లో ఐదుగురు కనిపించకుండా పోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని వెంకటగిరి మండలం జికే పల్లి గ్రామంలో ఇద్దరు తోడి కోడళ్లు, ముగ్గురు పిల్లలు అద్రుశ్యమయ్యారు. ఇద్దరు తోడి కోడళ్లు వారి పిల్లలను నిన్న మధ్యాహ్నం ఆసుప్రతికి తీసుకెళ్లిన వారి మళ్లీ కనిపించకుండా పోయారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అద్రుశ్యమైన వారి కోసం గాలిస్తున్నారు. కొన్ని రోజులుగా మిస్సింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి.  పోలీసులు కొన్నింటిని చాకచక్యంగా ఛేదిస్తున్నా మరికొన్ని విషాదంగా మారుతున్నాయి. తాజాగా ఒకే ఇంట్లో ఐదురుగు కనపించకపోవడంతో ఆందోళన వాతావరణం ఏర్పడింది.

Also Read: సీఎం జగన్ కు మరో షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ