తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాలపై కోర్టులో విచారణ జరపమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ఆలయంలో సాంప్రదాయాలు పాటించడం లేదని దాఖలైన పిటిషన్ ను బుధవారం ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయని, అవి ఒకే రకంగా ఉండాలనే నిబంధనలు లేవని తెలిపింది. ఈ విషయంతో తన హక్కులకు భంగం కలిగితే పిల్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.