ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ‘నవరత్నాలు-ఇళ్లపట్టాల పంపిణీ’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్ారు. ఆ తరువాత గ్రుహాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. ఊరందూరులో 167 ఎకరాల్లో 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 456 శ్రీకాళహస్తీ రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాల వారికి కేటాయించారు.