విజయవాడలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ప్రారంభం

కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి వ్యాక్సిన్ పంపిణీకొ ఐదు రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని క్రుష్ణా జిల్లాలో సోమవారం ఉదయం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్డ్ ఇనిస్టిట్యూట్, క్రుష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం, ప్రకాశ్ నగర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే […]

Written By: Suresh, Updated On : December 28, 2020 9:43 am
Follow us on

కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి వ్యాక్సిన్ పంపిణీకొ ఐదు రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని క్రుష్ణా జిల్లాలో సోమవారం ఉదయం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్డ్ ఇనిస్టిట్యూట్, క్రుష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం, ప్రకాశ్ నగర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో ప్రతి కేంద్రంలో ఐదుగురు వైద్య సిబ్బంది, 3 గదులను ఏర్పాటు చేశారు.