
రైతు సంక్షేమానికే బీజేపీ సర్కార్ కొత్త వ్యవసాయ చట్టం తీసుకొచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా గురువారం మాట్లాడారు. రైతుల సమస్యలను జనసేన నాయకులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ చట్టంతో రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు. రైతులను బలోపేతం చేయడం.. వారికి కొత్త అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా సంస్కరణలు తేవడానికే ప్రధానమంత్రి మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వ్యాఖ్యానించారు. రైతుల కిసాన్ బిల్లులో సవరణకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. కొంతమంది కావాలని ఈ చట్టంపై రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుందని చెప్పారు.