అమిత్ షా కు జగన్ లేఖ..

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనం అస్తవ్యస్తమైందని, తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని వెంటనే ఆదుకోవాలని కేంద్రమంత్రి అమిత్ షా కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.2,250 కోట్ల ఆర్థిక సాయం కావాలన్నారు. పెద్ద ఎత్తున సహాయం చేయడం కోసం కనీసం రూ.వెయ్యి కోట్లు తక్షణమే మంజూరు చేయాలని కోరారు. జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అంచనా వేసి నష్ట పరిహారం అందించాలన్నారు. ఈనెల 9 నుంచి 13 వ […]

Written By: Suresh, Updated On : October 18, 2020 1:30 pm
Follow us on

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనం అస్తవ్యస్తమైందని, తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని వెంటనే ఆదుకోవాలని కేంద్రమంత్రి అమిత్ షా కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.2,250 కోట్ల ఆర్థిక సాయం కావాలన్నారు. పెద్ద ఎత్తున సహాయం చేయడం కోసం కనీసం రూ.వెయ్యి కోట్లు తక్షణమే మంజూరు చేయాలని కోరారు. జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అంచనా వేసి నష్ట పరిహారం అందించాలన్నారు. ఈనెల 9 నుంచి 13 వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరంలో అత్యధికంగా 265.10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.