Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Reddy leaders silent: వైసీపీలో రెడ్డి నేతలు సైలెంట్.. కాపు నేతలు యాక్టివ్!

YSRCP Reddy leaders silent: వైసీపీలో రెడ్డి నేతలు సైలెంట్.. కాపు నేతలు యాక్టివ్!

YSRCP Reddy leaders silent: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వాతావరణం కనిపిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉండగా పదవులు, ఆర్థికంగా లాభ పొందిన వారిలో రెడ్డి సామాజిక వర్గం నేతలు అధికం. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ఓటమి ఎదురైన తర్వాత పూర్తిగా సామాజిక వర్గం నేతలు సైలెంట్ అయ్యారు. జగన్ ఎంతవరకు కాపు నేతలతో రాజకీయం చేస్తున్నారు. తమ వారిని మాత్రం రక్షించుకునే పనిలో ఉన్నారు. ఈ రాజకీయం తెలియక వైసీపీలో కాపు నేతలు జగన్ చట్రంలో ఇరుక్కుపోతున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా ప్రయోజనాలు రెడ్డి సామాజిక వర్గం నేతల వైతే.. కేసులతోపాటు వివాదాస్పద ముద్ర కాపు నేతలకు దక్కుతోంది. ఇది ఎంత మాత్రం కాపు నేతలు గ్రహించడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో..

ఒక వెలుగు వెలిగిన నేతలు..
వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా ఉండేవారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాజ్యసభ సభ్యుడితో పాటు టీటీడీ చైర్మన్ పదవి అనుభవించారు వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్రకు సమన్వయకర్తగా ఉంటూ.. బాగానే వెనకేసుకున్నారు విజయసాయిరెడ్డి. అమరావతి పై విషం కక్కుతూ అడుగడుగునా అడ్డుకున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాయలసీమను తన కనుసైగతో శాసించారు పుంగనూరు పెద్దిరెడ్డి. తాడిపత్రిలో సవాల్ చేస్తూ నిలిచారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ హడావిడి చేసేవారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. లిక్కర్ స్కాంతో ఎంతో కొంత వెనుకేసుకున్నారు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్డి సామాజిక వర్గమే సింహభాగం లబ్ది పొందింది. అయితే ఇప్పుడు ఓటమి ఎదురు కావడంతో వారంతా సైలెంట్ అయ్యారు.

వివాదాల్లో కాపు నేతలు..
రెడ్డి సామాజిక వర్గం వెళ్లిపోవడంతో కాపు సామాజిక వర్గంతో రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది గ్రహించక కాపు నేతలు రెచ్చిపోతున్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్,బొత్స సత్యనారాయణ లాంటి వారితో రాజకీయాలు చేస్తున్నారు. మధ్యలో విడదల రజిని, జోగి రమేష్ లాంటి వారితో మాట్లాడిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయిస్తున్నారు. వీరు సైతం జగన్ ఎంత చెబితే అంతా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని, పదవులను, ఆర్థిక ప్రయోజనాలను పంచుకున్న వారు మాత్రం ఇటువైపు చూడడం లేదు. అయితే ఇందులో జగన్ కుల ప్రయోజనం ఉంది. అది గ్రహించలేకపోతున్నారు వైసీపీలో ఉన్న కాపు నేతలు. తాము బాధితులుగా జగన్ చేతిలో మారిన వారు.. కాపులు అన్యాయానికి గురైపోతున్నారు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version