Homeఆంధ్రప్రదేశ్‌YSRCP reaction to Vizag Steel Plant accident: వైసీపీకి అలవాటైన శవ రాజకీయం!

YSRCP reaction to Vizag Steel Plant accident: వైసీపీకి అలవాటైన శవ రాజకీయం!

YSRCP reaction to Vizag Steel Plant accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది కార్మికులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అయితే స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసింది. బాధ్యత తీసుకొని ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ప్రమాదం జరిగిన వెంటనే హోం మంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మంత్రి నారా లోకేష్ కేజీహెచ్ కు వెళ్లారు. మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని చూసింది. సాక్షి మీడియా రిపోర్టర్ నినాదాలు చేయాలని అక్కడ ఉన్న వారిని పురమాయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని..
నిన్న ఘటన జరిగిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని ఒక రాజకీయ కోణంలో వినియోగించుకోవాలని చూసింది. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కారణాలు చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘాల నేతలను, వామపక్షాల ప్రతినిధులను రెచ్చగొట్టింది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తో మాట్లాడి బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా తో పాటు., ఇంట్లో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య అందేలా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరితగతిన స్పందిస్తే.. ఇటువంటి విషాదఛాయల్లో కూడా రాజకీయ లాభం వెతుక్కునే పనిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండడం ఆ పార్టీ తప్పుడు విధానాలను తెలియజేస్తోంది. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ పర్యటన ఉందని తెలుసుకొని పెయిడ్ సోషల్ మీడియా ఆర్టిస్టులను రంగంలోకి దించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

కావాలని పని గట్టుకొని..
మంత్రులు పరామర్శిస్తున్న ఆసుపత్రుల ప్రాంగణంలో కొంతమందిని నిలబెట్టి.. ప్రభుత్వంపై నిందలు వేసేలా బలవంతంగా నినాదాలు చేయించి.. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వికృతానందం పొందుతోంది. కార్మికులు చనిపోయారన్న బాధ కంటే.. ఈ ఘటన ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి ఒక అవకాశం దొరికిందని వైసిపి నేతలు సంతోష పడుతున్నారు. మరోవైపు కేజీహెచ్ ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్ ను వామపక్ష నేతలు చుట్టుముట్టారు. మృతుల కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వాగ్వాదానికి దిగారు. దీనిపై మంత్రి లోకేష్ అత్యంత హుందాగా.. అంతే గట్టిగా సమాధానం చెప్పారు. మేం కేవలం ఇక్కడకు వచ్చి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేతులు దులుపు కోవడానికి రాలేదంటూ తేల్చి చెప్పారు. బాధిత కుటుంబాలు కోలుకునే వరకు.. ఆయా కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడతాం అని లోకేష్ స్పష్టం చేయడంతో వారు నోరు మెదపలేకపోయారు.

అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ..
స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 100% కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. అక్కడ ఏదైనా లోపం తలెత్తితే దానికి ప్లాంట్ యాజమాన్యం బాధ్యత వహించాలి. కేంద్ర ఉక్కు శాఖ బాధ్యత తీసుకోవాలి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం పై రుద్దేందుకు వైసిపి ప్రయత్నించడం చూస్తుంటే వారి రాజకీయ కాంక్ష ఇస్తే అర్థం అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా, ఎవరైనా చనిపోయినా.. శవాలపై పేలాలు ఏరుకునే చందంగా శవ రాజకీయాలు చేయడానికి వైసిపి ఏమాత్రం సిగ్గుపడడం లేదు. వారికి బాధితులకు న్యాయం చేయడం ఇష్టం లేదు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే ఎజెండా.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version