Rayalaseema Lift Irrigation: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పై గట్టి పోరాటమే చేస్తోంది. చంద్రబాబుతో మాట్లాడి తాను రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపానని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. అయితే ఆ ప్రాజెక్టు పనులను తానే నిలిపివేసిన విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కనీసం అనుమతులు తీసుకోకుండా.. అసలు సరైన ప్రణాళిక లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దిగారు జగన్మోహన్ రెడ్డి. ఒక రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతగా ఆ ప్రాంతానికి న్యాయం చేశానని ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేలా చేశారు. కానీ అనుమతులు తీసుకోకపోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అదే సమయంలో తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఎలాగూ అనుమతులు లేవు కాబట్టి కేంద్రం ఆదేశాలతో పనులు నిలిపివేశారు జగన్మోహన్ రెడ్డి.
* అప్పుడే నిలిచిపోయిన ప్రాజెక్ట్.. రాయలసీమ( Rayalaseema ) ఎత్తిపోతల పథకం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిలిచిపోయింది. ఇప్పుడు రేవంత్ ప్రకటనతో దానికి జీవం పోస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాట బాట పట్టింది. ఇదే చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి మేలు చేయాలన్న లక్ష్యంతో నదీ జలాల మిగులతో రాయలసీమకు నీరు పంపించాలని ప్రణాళిక వేశారు. తెలంగాణ సమాజం నుంచి దానికి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అక్కడ అధికార కాంగ్రెస్ తో పాటు గులాబీ పార్టీ కూడా వ్యతిరేకించింది. కానీ ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు ప్రయత్నాన్ని సమర్థించలేదు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఆందోళనలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణలో కెసిఆర్ పార్టీ మాత్రం కనీసం దీనిపై స్పందించడం లేదు. అదే ఏపీలో ఇతర పార్టీలు చేసి ఉంటే ఈపాటికి గులాబీ పార్టీ సౌండ్ చేసేది.
* ఉమ్మడి శత్రువు ఉండడంతో.. తెలంగాణలో( Telangana) గులాబీ పార్టీ, ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్థితిలో ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు చంద్రబాబు. ఆపై కాంగ్రెస్ పార్టీ అన్న పడదు. బిజెపితో చేతులు కలుపుతాం అంటే కుదరదు. ఎల్లవేళలా బిజెపి నుంచి సహాయం దొరికే పరిస్థితి కూడా లేదు. అందుకే సమిష్టిగా ముందుకు వెళుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలు విషయంలో రాజీ పడుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సజ్జల నేతృత్వంలో సభ పెడితే గులాబీ పార్టీ కనీసం కిక్కురు మనలేదు. అదే టిడిపి నేతలు ఎవరైనా అలాంటి విచ్చేసి ఉంటే మాత్రం కెసిఆర్ నేతృత్వంలోని గులాబీ పార్టీ నేతలంతా బయటకు వచ్చి విమర్శలు చేసేవారు. ఆ పార్టీ అధికార పత్రిక నమస్తే తెలంగాణ వ్యతిరేక వార్తలతో నింపేసేది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి.. చంద్రబాబు సర్కారు ఉంది కాబట్టి.. వైసీపీకి రాజకీయ ప్రయోజనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సైలెంట్ పాటిస్తోంది.
