ఆంధ్రప్రదేశ్‌Pawankalyan : వైసీపీ ప్రయత్నాలు విఫలం.. కాపులంతా పవన్ వెంటే..

Pawankalyan : వైసీపీ ప్రయత్నాలు విఫలం.. కాపులంతా పవన్ వెంటే..

Pawankalyan : పవన్ వారాహి తొలివిడత యాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. వైసీపీ నేతల ఫ్యూజులు కదిలిపోయాయి. అది ఎవరో పనిగట్టుకొని చెప్పడం అక్కర్లేదు. అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం, స్పందన చూస్తుంటే తెలిసిపోతోంది. వారే యాత్రను సక్సెస్ చేశారు. వారాహిని పంది అనడం నుంచి పవన్ కళ్యాణ్ అంతుచూస్తామన్న వరకూ పరిస్థితి వచ్చిందంటే వారి కడుపు మంటతో యాత్ర ఎంతలా వారిని కదిలించిందో అర్ధమవుతోంది. చివరకు సజ్జల నుంచి పోసాని కృష్ణమురళీ వరకూ ఎంటరయ్యారంటే పవన్ ఎంత గట్టిగా కొట్టారోనని జన సైనికులు సెటైర్లు వేస్తున్నారు. అయితే డజను కొద్దీ నేతలు పనిగట్టుకొని రావడం వెనుక వైసీపీ పక్కా స్కెచ్ ఉంది. కాపుల్లో కాస్తా చీలిక తెచ్చైనా జరగాల్సిన నష్టాన్ని అధిగమిద్దామన్న ప్లాన్ కనిపిస్తోంది.

సాధారణంగా పవన్ కార్యక్రమాలంటేనే జన సమీకరణ చేయాల్సిన పని ఉండదు. అందునా పవన్ ప్రభావం అధికంగా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో అయితే వారాహి యాత్ర గురించి చెప్పనక్కర్లేదు. ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ముఖ్యంగా కాపులు విపరీతంగా పోలరైజ్ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. దీంతో ప్రభుత్వ వర్గాల్లో కలవరపాటు రేగింది. ఏదో ఉపశమన చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన జగన్ సర్కారు ముద్రగడను రంగంలోకి దించింది. ఏకంగా ఓ రెడ్డి సామాజికవర్గం నేతను అడ్డంపెట్టుకొని కాపులను చీల్చాలన్న ప్లాన్ ను రెడీ చేసింది. అయితే పవన్ ను తిట్టాలన్న వ్యూహానికి ముద్రగడ లాంటి నాయకుడు ఒప్పుకోవడం ఆత్మహత్య సదృశ్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే వైసీపీ కాపు నాయకులు పవన్ కు అడ్డంగా వెళ్లి చేతులు కాల్చుకున్నారు. అంతకు మించిన వ్యక్తులతోనే తిట్టిస్తే కాపుల్లో ఒక రకమైన భావన కలుగుతుందని భావించారు. అందుకే ముద్రగడను రంగంలోకి దించారు. యావత్ కాపు జాతి పవన్ వెంట నడవకూడదనే భావనతోనే కాపు ఉద్యమం చేసిన ముద్రగడను ఎంచుకున్నారు. అది కూడా వర్కవుట్ అవ్వకపోయేసరికి ముద్రగడను పొగడ్తలతో ముంచెత్తే బ్యాచ్ ను రంగంలోకి దించారు. వంగవీటి మోహన్ రంగా బావమరిదితో సైతం చెప్పించారు. చివరకు పోసాని కృష్ణమురళీని సైతం రప్పించి ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి ఎదురైన అవమానాలు గుర్తుచేయించారు. తాను కమ్మ అయినా నాడు కాపు జాతిపై కుట్ర చేశారని చెప్పించి పవన్ ను వెనక్కి తగ్గించే ఏర్పాట్లు చేశారు. ఆ పాచిక కూడా పారలేదు.

పవన్ పై సామ, వేద దండోపాయాలను ప్రయోగించాలని చూశారు. చివరకు ముద్రగడ సవాళ్ల పర్వానికి దిగారు. దమ్ముంటే పిఠాపురం నుంచి తనపై పోటీచేయించాలని సవాల్ చేశారు. కానీ దేనికీ పవన్ స్పందించలేదు. కానీ కాపు సంఘం ప్రతినిధులు, జన సైనికులు ముద్రగడకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. కాపులను అడ్డగించాలన్న ప్రయత్నంలో భాగంగా పవన్ పై వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. దీంతో కాపుల్లో ఒక రకమైన ఐక్యతారాగం కనిపించింది. అది తప్పకుండా వైసీపీకి నష్టం చేకూర్చుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Pawan Kalyan : పేర్ని నాని మాటలకు నిరంజన్ ఎంత బాధ పడ్డాడో చూడండి.. చివరి మాటలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు..

Pawan Kalyan : వరంగల్ చెందిన నిరంజన్ అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని రీసెంట్ గానే కన్నుమూసిన ఘటన యావత్తు ప్రజానీకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. చిన్న తనం నుండి జెన్యూ సంబంధిత...

Pawan Jagan : పవన్ ట్రాప్ లో జగన్

Pawan Jagan :  రాజకీయాలు ఇలానే ఉండాలని లేదు. ఒకే విధంగా ఉంటే వాటిని రాజకీయాలు అనరు. చాణక్య నీతి ఆధారంగా రాజకీయాలు సాగుతూ ఉంటాయి. రాజకీయం అంటేనే పరమపద సోపానం లాంటిది....

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version