Homeఆంధ్రప్రదేశ్‌YCP Social Media: వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు అక్కడి నుంచే జీతాలు

YCP Social Media: వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు అక్కడి నుంచే జీతాలు

YCP Social Media: ఏపీ వ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వందలాదిమందిపై ఈ కేసులు నమోదు చేస్తున్నారు ఏపీ పోలీసులు. అదే సమయంలో అరెస్టులు సైతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో క్రియాశీలకంగా వ్యవహరించిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జిగా ఉన్న సజ్జల భార్గవరెడ్డి,రాష్ట్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన అర్జున్ రెడ్డిలపై సైతం కేసులు నమోదు చేశారు. ఇంకోవైపు సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మపై సైతం కేసు నమోదు అయ్యింది. అయితే వీరంతా వైసిపిపై, అధినేత జగన్ పై అభిమానంతో పనిచేసినవారు అని ఇప్పటివరకు భావించారు. సోషల్ మీడియా విభాగం కొద్దిపాటి జీవితాలు అందించేదని అంతా అనుకున్నారు. కానీఆసక్తికర విషయం ఒకటి బయటపడింది.వీరందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లించినట్లు తేలింది.ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఈ జీతాలు విడుదలైనట్లు తెలుస్తోంది.వర్రా రవీందర్ రెడ్డి విచారణలో ఈ విషయం స్పష్టమైనట్లు సమాచారం.

* వైసిపి హయాంలో ఏర్పాటు
వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేపట్టే మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లడం దీని ఉద్దేశం. కానీరాష్ట్రవ్యాప్తంగా వైసిపి కోసం పనిచేసిన సోషల్ మీడియా ప్రతినిధులకు భారీ మొత్తంలో జీతాలు ఈ కార్పొరేషన్ నుంచి చెల్లించినట్లు పోలీస్ విచారణలో తేలింది.విపక్ష నేతలు,వారి కుటుంబ సభ్యులు,హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టే వారిని, వివిధ ప్రాంతాల్లో ఉంటూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు చెల్లించి మరియు ప్రోత్సహించినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది.

* రవీందర్ రెడ్డి విచారణలో తేలింది
కడపలో తప్పించుకున్నారు వర్రా రవీందర్ రెడ్డి.తెలంగాణలో తిరిగి పట్టుబడ్డారు.ఆయన విచారణలో ఈ విషయం బయటకు వచ్చినట్లు సమాచారం.ఇదే విషయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ వెల్లడించారు. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకున్నట్లు తేలిందన్నారు.ఒక్క రవీందర్ రెడ్డికే కాదు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియాలో పనిచేసిన వారందరికీ.. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు అందినట్లు పోలీస్ శాఖ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. సమగ్ర వివరాలు సేకరించి ప్రభుత్వం బయటపెట్టే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper
Exit mobile version