AP Election Survey 2024: ఏపీలో మళ్లీ వైఎస్సార్‌ సీపీదే అధికారం.. తేల్చిన క్యూ ఇమేజ్‌ సర్వే!

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేరుతో ఇటీవల టైమ్స్‌నౌ, నాగన్న ఫలితాలు వైరల్‌ కాగా, తాజాగా కూ‍్య ఇమేజ్‌ సర్వే సంస్థ చేసిన సర్వే ఫలితాల పేరుతో ఓ పీడీఎఫ్‌ ఫైల్‌ వైరల్‌ అవుతోంది.

Written By: Raj Shekar, Updated On : May 31, 2024 6:43 pm

AP Election Survey 2024

Follow us on

AP Election Survey 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏడో విడత ఎన్నికలు జూన్‌ 1న 57 స్థానాలకు జరుగనున్నాయి. ఈ స్థానాలకు 902 మంది పోటీ పడుతున్నారు. చివరి దశ ఎన్నిలు ముగిసిన సాయంత్రమే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దేశంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు నోటిషికేషన్‌ విడుదల చేసింది. యావత్‌ దేశం లోక్‌సభ ఎన్నికలతోపాటు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఉంది. ఎవరికీ అంతుచిక్కని ఫలితాలతో ఏపీలోని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీ, జన సేన కూటమి ఎవరూ గెలుపు తమదని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే టౌమ్స్‌ నౌ సర్వే, నాగన్న సర్వే ఫలితాల పేరిట సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. తాజాగా మరో సర్వే ఫలితాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

క్యూ ఇమేజ్‌ సర్వే ఇలా..
ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేరుతో ఇటీవల టైమ్స్‌నౌ, నాగన్న ఫలితాలు వైరల్‌ కాగా, తాజాగా కూ‍్య ఇమేజ్‌ సర్వే సంస్థ చేసిన సర్వే ఫలితాల పేరుతో ఓ పీడీఎఫ్‌ ఫైల్‌ వైరల్‌ అవుతోంది. టౌమ్స్‌నౌ, నాగన్న సర్వే ఫలితాల తరహాలోనే క్యూ ఇమేజ్‌ సర్వే ఫలితాలు ఉన్నాయి. టైమ్స్‌నౌ, నాగన్న సర్వే సంస్థలు ఏపీలో మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చగా, తాజాగా క్యూ ఇమేజ్‌ సర్వే కూడా అదే తేల్చింది.

ఎవరికి ఎన్ని సీట్లంటే..
కూ‍్య ఇమేజ్‌ సర్వే ప్రకాం.. ఏపీలో అధికార వైసీపీ 114 ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తుందని తెలిపింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 38 సీట్లు వస్తాయని పేర్కొంది. ఎమ్మెల్యే స్థానాల్లో 23 చోట్ల వైసీపీ, కూటమి అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంటుందని తెలిపింది. ఇక లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే.. మొత్తం 25 స్థానాల్లో అధికార వైసీపీ 21 స్థానాలు గెలుస్తుందని, కూటమికి కేవలం 3 స్థానాలే వస్తాయని తెలిపింది. ఒక ఎంపీ స్థానంలో ఇరుపక్షాల మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది.