Homeఆంధ్రప్రదేశ్‌AP RTC Buss: ఏపీఎస్ ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా ఊడిన చక్రాలు.....

AP RTC Buss: ఏపీఎస్ ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా ఊడిన చక్రాలు.. మొన్న అలా.. నేడు ఇలా

AP RTC Buss: ఏపీఎస్ ఆర్టీసీ నవ్వులపాలవుతోంది. మొన్నటికి మొన్న వర్షానికి బస్సులో కారిపోతుండగా ప్రయాణికులు గొడుగులు వేసుకున్నారు. ఇప్పుడు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ సకాలంలో గుర్తించి బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలో మారిన తరువాతే ఆర్టీసీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. బస్సుల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. మెయింటెనెన్స్ బాగాలేకపోతోందని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. కొత్త బస్సుల కొనుగోలు లేవు. ఉన్నవాటికి మరమ్మతులు చేయరు. కొత్తగా సిబ్బందిని భర్తీ చేయడం లేదు. దీనికితోడు రహదారులు బాగాలేకపోవడంతో ఎక్కడికక్కడే బస్సులు మొరాయిస్తున్నాయి.దీంతో ఏపీఎస్ ఆర్టీసీ అంటేనే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. అటు సోషల్ మీడియాలో, ఇటు బయట విమర్శలకు గురిచేస్తున్నాయి.

AP RTC Buss
APSRTC

ఏలూరు జిల్లాలోని నరసాపురం డిపోకు చెందిన బస్సు జాతీయ రహదారిపై ఏలూరు వెళుతుండగా ఆకివీడు మండలం అజ్జమూరు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న బస్సు వెనుక చక్రాలు రెండూ ఊడిపోయాయి. పెద్ద శబ్దం రావడాన్ని గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఆ సమయంలో బస్సులో 40 మంది వరకూ ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో అటు ఇటుగా వాహనాలు అతి వేగంగా వచ్చినా భారీ ప్రమాదం జరిగేది. ఊహించనంతగా ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హైవేపై ప్రయాణికులు గంటల తరబడి ఉండిపోవాల్సి వచ్చింది. ప్రయాణికులు కొందరు ఇది మన ఏపీఎస్ ఆర్టీసీ తీరు అంటూ ఊడిపోయిన చక్రాల ఫొటోలను పోస్టు చేశారు. క్షణాల్లో ఇవి వైరల్ గా మారాయి.

రన్నింగులో ఉన్న బస్సు చక్రాలు ఊడడంపై జనసేన, టీడీపీ శ్రేణులు రియాక్టయ్యాయి. సోషల్ మీడియాలో ఫొటోలను వైరల్ చేశాయి. జనసేన కీలక నాయకుడు నాదేండ్ల మనోహర్ ఫొటోను పోస్టుచేశారు. రాష్ట్రంలో రోడ్లు ఉన్నాయని.. వాటిపై బస్సులు, కార్లు, లారీలు, ఇతర వాహనాలు తిరుగుతాయని సీఎం జగన్ కు తెలిసినట్టు లేదని షటైర్ ట్యాగ్ చేశారు. ఇప్పుడిది విపరీతంగా ట్రోల్ అవుతుంది. అటు జన సైనికులు కూడా తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో రహదారు పరిస్థితిపై జనసేన పోరాడుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికైతే వరుసగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో జరుగుతున్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version