AP Politics : జగన్, చంద్రబాబు ముస్లిం మతపెద్దలను ఒకేసారి కలవడానికి కారణాలేంటి?

ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కేంద్రం తీసుకొచ్చే బిల్లు కచ్చితంగా తమ మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నారు. కానీ బీజేపీకి భయపడి వైసీపీ,టీడీపీ ఈ బిల్లుకు మద్దతిచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి.

Written By: NARESH, Updated On : July 19, 2023 8:42 pm
Follow us on

Muslim Vote bank : ఏపీలో సరికొత్త రాజకీయం నడుస్తోంది. ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు వరుసగా సమావేశమవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా ఏదో ఒక రాజకీయ ఎత్తుగడ ఉంటే కానీ.. ఒకే రోజు అధికార, విపక్ష నాయకుల ఒక వర్గం నాయకులకు, ప్రతినిధులకు కలిసేందుకు అవకాశమివ్వరు. కానీ అటువంటిది ఒకేసారి ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు, ప్రతినిధులను ఇద్దరు నేతలు పిలిచి మాట్లాడడం చూస్తుంటే ఓ కీలక నిర్ణయం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.

ఎన్డీఏ సర్కారు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్) సివిల్ కోడ్ బిల్లు తేనున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనిపై దేశ వ్యాప్తంగా ముస్లింలు గుర్రుగా ఉన్నారు. ఏపీలో సైతం బీజేపీపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో సన్నిహిత సంబధాలున్న వైసీపీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న టీడీపీ ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. కేంద్రం తీసుకునే నిర్ణయంతో తాము మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భయపడుతున్నాయి. అందుకే ముస్లిం ప్రతినిధుల అభిప్రాయాన్ని తీసుకుకున్నాయి.

ఉమ్మడి పౌరస్మృతిని కేంద్రం అమలు చేస్తే తీవ్రంగా వ్యతిరేకించేందుకు దేశవ్యాప్తంగా ముస్లింలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే లా కమిషన్ చేపట్టిన అభిప్రాయ సేకరణకు ముస్లింలు లక్షల సంఖ్యలో తమ అభిప్రాయాలు పంపారు. ఇంకా పంపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కేంద్రం తీసుకొచ్చే బిల్లు కచ్చితంగా తమ మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నారు. కానీ బీజేపీకి భయపడి వైసీపీ,టీడీపీ ఈ బిల్లుకు మద్దతిచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. అందుకే తాము ఆ బిల్లుకు మద్దతిచ్చే అవకాశమే లేదని తేల్చిచెబుతున్నాయి. ఈ విషయంలో ఎక్కడ వెనుకబడిపోతామని తమకు మద్దతుదారులుగా నిలిచే ముస్లిం ప్రతినిధుల ద్వారా మచ్చిక చేసుకునే ప్రయత్నంలో పడ్డాయి.

అయితే అటు సీఎం జగన్, ఇటు చంద్రబాబు ముస్లిం ప్రతినిధులకు ఊరడించే మాటలు చెప్పారు. కానీ ఈ బిల్లు పార్లమెంట్ లోకి వస్తే వ్యతిరేకిస్తామని మాత్రం చెప్పలేదు. సీఎం జగన్ అడుగు ముందుకేసి అసలు ఆ బిల్లు డ్రాఫ్ట్ రూపంలో రాలేదని.. మీడియాలో వస్తున్న కథనాలు చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. అటు చంద్రబాబు సైతం తాము ముస్లింలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోమని చెప్పారు.

అయితే ఈ బిల్లు విషయంలో వైసీపీయే ఎక్కువ బాధపడుతోంది. లోక్ సభలో 23 మంది ఎంపీలతో పాటు రాజ్యసభలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు.పైగా టీడీపీతో పోల్చుకుంటే ముస్లింల బలం వైసీపీకే ఎక్కువ. ఒక వేళ బీజేపీ పట్టుబడితే మాత్రం తప్పకుండా సపోర్టు చేయాల్సిన అవసరం. అదే జరిగితే ముస్లింల ఆగ్రహం చవిచూడాల్సిన పరిస్థితి. అటు చంద్రబాబుది అదే పరిస్థితి. పొత్తు పెట్టుకోవాల్సిన వేళ బీజేపీ అడిగితే తప్పకుండా సాయం చేయాల్సి ఉంటుంది. అందుకే ముందుగా ఇరువురు నేతలు ముస్లిం ప్రతినిధులను దువ్వుతున్నారన్నమాట