Homeఆంధ్రప్రదేశ్‌Tirumala Parakamani Case: తిరుమల పరకామణి కేసు.. విచారణ ఎందుకు ఆగినట్టు!?

Tirumala Parakamani Case: తిరుమల పరకామణి కేసు.. విచారణ ఎందుకు ఆగినట్టు!?

Tirumala Parakamani Case: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరికామణి విభాగంలో 2023లో జరిగిన దొంగతనంపై కేసు మళ్లీ దృష్టిలోకి వచ్చింది. అప్పటి ఉద్యోగి రవికుమార్‌ పాల్గొన్నారని అనుమానంతో టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఏప్రిల్‌ 2023లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే ఏడాది సెప్టెంబర్‌లో లోక్‌ అదాలత్‌ ముందు రవికుమార్‌తో రాజీ కుదిరింది. ఈ రాజీ నిర్ణయం చట్టపరంగా ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

జర్నలిస్టు పిటిషన్‌తో హైకోర్టు దృష్టి
స్థానిక జర్నలిస్టు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్‌ వేసి, ఈ చోరీపై సీఐడీ దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. ఆయన వాదన ప్రకారం, పరకామణిలో ఆర్థిక లావాదేవీలు చాలా పెద్దవి కాబట్టి దొంగతనం కేవలం సాధారణ సంఘటన కాదని పేర్కొన్నారు. పిటిషన్‌ విచారణ తరువాత హైకోర్టు జస్టిస్‌ రామకృష్ణ, లోక్‌ అదాలత్‌ ఇచ్చిన రాజీ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసి, సీఐడీదే పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఖజానా రికార్డులు, రాజీ ఒప్పంద పత్రాలు సీజ్‌ చేయాలని సూచించారు. కానీ ఈ కీలక ఆదేశాలు ఇప్పటివరకు అమలుకాకపోవడంతో సీఐడీ పాత్రపై అనుమానాలు పెరిగాయి.

ప్రజా నిధుల భద్రతపై ప్రశ్నలు
పరకామణి లావాదేవీలు ప్రజల విరాళాలతో నడుస్తున్నందున, ఆ నిధుల భద్రతపై ఉన్నతస్థాయి పర్యవేక్షణ ఉండాల్సిందే. కానీ ఈ ఘటన తరువాత టీటీడీ అంతర్గత వ్యవస్థలో పారదర్శకత ఎంతవరకు ఉందనే ప్రశ్న తలెత్తింది. హైకోర్టు ఆదేశాల అమలులో జాప్యం కొనసాగితే, స్వతంత్ర ఆడిట్‌ లేదా కోట్రోల్‌ అధికారి విచారణ అవసరమవుతుందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇక సీఐడీ తక్షణ చర్యలు చేపడితేనే, దొంగతనం నిజానిజాలు బయటపడే అవకాశముంది.

రాజీ చట్టబద్ధతపై ప్రశ్న
లోక్‌ అదాలత్‌ ముందుకు వచ్చిన రాజీ అనేది సాధారణంగా పౌర వివాదాలు లేదా చిన్నారుల హక్కులు లాంటి దావాలలో మాత్రమే అమల్లోకి వస్తుంది. కాని ఇక్కడి విషయం దొంగతనం, పబ్లిక్‌ ట్రస్ట్‌ నిధుల దుర్వినియోగం నేపథ్యంలో ఉంది. ఇది క్రిమినల్‌ నేచర్‌ కేసు, అంటే రాజీ ద్వారా పూర్తిగా ముగించడం చట్టపరంగా సాధ్యం కాదని న్యాయవేత్తలు స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు పరిధిలోకి వచ్చే ఇటువంటి కేసుల్లో, రాజీకి మేజిస్ట్రేట్‌ ఆమోదం లేదా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సూచన తప్పనిసరి. ఈ రెండు శరతులు తీరకపోతే, రాజీ చెల్లుబాటు కాదు.

హైకోర్టు జోక్యానికి కారణం
జస్టిస్‌ రామకృష్ణ తీసుకున్న తాత్కాలిక నిర్ణయం లోక్‌ అదాలత్‌ ఉత్తర్వులను నిలిపివేసి, సీఐడీ విచారణను ఆదేశించడం న్యాయపరంగా ప్రజా ప్రయోజన రక్షణ చర్యగా గుర్తించబడింది. ఎందుకంటే ఈ వ్యవహారం ప్రజల విరాళాలకు సంబంధించినది. ఇందులో రాజీ ద్వారా నిందితుడిపై చర్య నిలిపివేయడం పబ్లిక్‌ ఫండ్‌ మిస్యూప్‌ను క్షమించడమే అవుతుంది, ఇది చట్టపరంగా అనుచితం.

సీఐడీ బాధ్యత
సీఐడీకి కోర్టు స్పష్టంగా ఖజానా లావాదేవీల రికార్డులు, రాజీ ఆధార పత్రాలు సీజ్‌ చేయమని ఆదేశించింది. కానీ సీడీ ఆదేశం అమలు చేయకపోవడం న్యాయపరంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో హైకోర్టు సీఐడీ అధికారులపై కాంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular