Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » The union agriculture ministry has announced big good news for chilli farmers

Mirchi Farmers : ఏపీ మిర్చి రైతులకు గుడ్ న్యూస్… జగన్మోహన్ రెడ్డా? చంద్రబాబా?.. క్రెడిట్ ఎవరికి?

Written By:Dharma Raj, Updated On : February 21, 2025 / 05:15 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
The Union Agriculture Ministry Has Announced Big Good News For Chilli Farmers

Mirchi Farmers

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Mirchi farmers : మిర్చి రైతులకు ( Mirchi farmers)గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. మిర్చి రైతులకు భారీ శుభవార్త ప్రకటించింది. మిర్చి పంట పై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి మిర్చి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీం కింద ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్దమయింది. ఈ స్కీం కింద వీలైనంత ఎక్కువ సాయం చేసే ప్రతిపాదనను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు గురువారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశించారు. ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల తోనూ సమన్వయం చేసుకొని పరిష్కారం కనుగొనాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలతో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు.

* మార్కెట్ యార్డ్ ను సందర్శించిన జగన్
ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) గుంటూరు మిర్చి యార్డును పరిశీలించిన సంగతి తెలిసిందే. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మిర్చికి గిట్టుబాటు కలగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేశారు. అందులో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. తక్షణం మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో.. ఎన్డీఏ భాగస్వామి పక్షంగా సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు.

* కేంద్ర మంత్రిని కలిసిన చంద్రబాబు
అయితే ముందస్తు షెడ్యూల్ లో భాగంగానో.. లేకుంటే జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన విమర్శలను గుర్తించో.. తెలియదు కానీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) నేరుగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కలిశారు. మిర్చి రైతుల సమస్యలను విన్నవించారు. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తావించే వరకు మిర్చి రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చంద్రబాబు చేయలేదని.. కానీ అప్పటికప్పుడు కేంద్రమంత్రిని కలిసి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇంతలో కేంద్ర ప్రభుత్వం నుంచి మిర్చి రైతులకు గుడ్ న్యూస్ వచ్చింది. దీంతో మిర్చి ధర పెరిగే అవకాశం ఉంది.

* ఆ తేడాను భరించేందుకు ముందుకు వచ్చిన కేంద్రం
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీములో( market intervention scheme) 25 శాతం ఉన్న సీలింగ్ ను ఎత్తివేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 75% మేర పంట కొనుగోలుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమాచారం. మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్రం అంగీకరించింది. మార్కెట్ ధర- ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించేందుకు కేంద్రం సిద్ధమయింది. మిర్చి రైతుల అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లడంతో.. దీనికి పరిష్కార మార్గం దొరికిందని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన తరువాతే మిర్చి రైతుల సమస్యలకు పరిష్కార మార్గం దొరికిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కూడా ప్రారంభం అయింది.

Dharma Raj

Dharma Raj Author - OkTelugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

View Author's Full Info

Web Title: The union agriculture ministry has announced big good news for chilli farmers

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • AP Mirchi Farmers
  • ap politics
  • Mirchi farmers
  • Union Agriculture Ministry
Follow OkTelugu on WhatsApp

Related News

TDP Master Sketch: మహానాడులో భారీ చేరికలు.. ఆ జిల్లా పై టిడిపి మాస్టర్ స్కెచ్!

TDP Master Sketch: మహానాడులో భారీ చేరికలు.. ఆ జిల్లా పై టిడిపి మాస్టర్ స్కెచ్!

Jyothula Nehru: కమ్యూనిస్టులకు పట్టిన గతే టిడిపికి.. సీనియర్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

Jyothula Nehru: కమ్యూనిస్టులకు పట్టిన గతే టిడిపికి.. సీనియర్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

AP Political survey : ఆ రెండు జిల్లాల్లో కూటమి పరిస్థితి ఇలా.. సంచలన సర్వే

AP Political survey : ఆ రెండు జిల్లాల్లో కూటమి పరిస్థితి ఇలా.. సంచలన సర్వే

Ghanta Ravi Teja : బతికునోళ్లకు జోహర్లు ఏంటయ్యా.. బుద్ది ఉండక్కర్లా?

Ghanta Ravi Teja : బతికునోళ్లకు జోహర్లు ఏంటయ్యా.. బుద్ది ఉండక్కర్లా?

NMD Feroz : తాగి రోడ్లపై తిరగండి.. పోలీసులు ఆపితే ఫోన్ చేయండి

NMD Feroz : తాగి రోడ్లపై తిరగండి.. పోలీసులు ఆపితే ఫోన్ చేయండి

CM Chandrababu : మహానాడుకు ముందే ఢిల్లీకి చంద్రబాబు.. ఏంటి కథ?

CM Chandrababu : మహానాడుకు ముందే ఢిల్లీకి చంద్రబాబు.. ఏంటి కథ?

Y S Jagan Mohan Reddy: కూటమి’పై జగన్ ప్రతీకారం తప్పదా?

Y S Jagan Mohan Reddy: కూటమి’పై జగన్ ప్రతీకారం తప్పదా?

YSR Congress : వైసీపీలో లోపిస్తున్న ‘కమ్మ’దనం.. ఆ వర్గం నేతలంతా సైలెంట్!

YSR Congress : వైసీపీలో లోపిస్తున్న ‘కమ్మ’దనం.. ఆ వర్గం నేతలంతా సైలెంట్!

Vallabhaneni Vamsi:  తీవ్ర నిర్ణయం దిశగా వల్లభనేని వంశీ మోహన్.. బెయిల్ పై వచ్చిన వెంటనే!

Vallabhaneni Vamsi:  తీవ్ర నిర్ణయం దిశగా వల్లభనేని వంశీ మోహన్.. బెయిల్ పై వచ్చిన వెంటనే!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.