Anant Babu and Duvvada Srinivas: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా కారణాలతో పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కానీ.. ఎమ్మెల్సీలను కానీ సస్పెన్షన్ చేస్తే వారిని దూరంగా ఉంచుతారు. అదేంటో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇట్టే కలిసిపోతున్నారు. నిన్న సభకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. సభకు హాజరై తిరిగి వచ్చే క్రమంలో నిరసన తెలిపారు. ఆ నిరసనలు ఇద్దరు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అయితే ఆ ఇద్దరూ సస్పెన్షన్ వేటుకు గురైన వారే. అయితే పేరుకే వారి సస్పెన్షన్ కానీ.. ప్రజల్లో చెడ్డ పేరు రాకూడదు అని చేశారే కానీ అన్నట్టు ఉంది నిన్నటి పరిస్థితి. బాహటంగానే ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు అధినేత జగన్మోహన్ రెడ్డి వెంట కనిపించారు. అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఎంచక్కా ఆయన పక్కనే..
కారు డ్రైవర్ హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంత్ బాబు( MLC Anant Babu ). వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కారు డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలను అనంతబాబు ఎదుర్కొన్నారు. హత్య కేసులో కొద్దిరోజుల పాటు రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. అప్పట్లో దళిత సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో అనంత బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన సస్పెండ్ కు గురయ్యారే కానీ ఎన్నడూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసినట్లు కనిపించలేదు. మిగతా నేతలతో కలిసే తిరుగుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చినప్పుడు ఆయన వెంట కనిపించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి కూడా అదే. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలతో ఆయనపై వేటు పడింది. కానీ నిన్న జగన్తో పాటు ఆయన కనిపించారు. జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేశారు. ఏం చేస్తున్నావ్ అంటూ.. ఏం చేయబోతున్నావు అంటూ పలకరింపులు కూడా జరిగాయి. తద్వారా ఆయన సైతం సస్పెన్షన్ వేటు పడిన ఎమ్మెల్సీగా కాకుండా.. సొంత పార్టీ ఎమ్మెల్సీ గానే ట్రీట్ చేయాల్సి వచ్చింది.
ఇటీవల జనసేన ఎమ్మెల్యే పై ఆరోపణ..
ఇటీవల జనసేన ఎమ్మెల్యే పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రస్తావించారు. అటువంటి నేతలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఈ తరహా ఆరోపణలు వచ్చి తన పార్టీ నేతలను సస్పెండ్ చేశారు కానీ. వారితోనే తిరుగుతున్నారు. వారు సైతం అధినేత పట్ల అభిమానాన్ని చూపుతూ ఆయన వెంటే నడిచినట్టు కనిపించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి యాక్షన్లు ఉండేవి కావు. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణలు ఉండేవి కావు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ సస్పెన్షన్లు తప్పనిసరి. కానీ అలా సస్పెన్స్ వేటుపడిన నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి తో కలిసి కనిపిస్తున్నారు. ఆ సస్పెన్షన్లు ఉత్తమాటేనని తేల్చి చెబుతున్నారు.